తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి దీక్ష

posted on: Sep 2, 2012 5:27PM

సోమవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ కోసం కిషన్‌రెడ్డి ఉపవాస దీక్ష చేపట్టనున్నారు. తాను చేపట్టబోయే దీక్షకు అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరవుతారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరేంటో ముందు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో తెలంగాణే మా ప్రధాన ఎజెండా అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరి వల్లే తెలంగాణలో వందలాది ఆత్మహత్యలకు పాల్పడ్డారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...