కిరణ్‌కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

సమైక్యా రాష్ట్రనికి మొదటి నుంచి గట్టి మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ప్రజలే ప్రభుత్వానికి బుద్దిచెపుతారన్నారు.

విభజన విషయంలో సీమాంద్ర భగ్గుమంటున్న సమయంలో తెలుగు భాషా దినోత్సవంలో సియం హోదాలో పాల్గొన్న ఆయన ఘూటుగా స్పందించారు. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడుతున్నట్టుగా తెలియకుండానే తెలుగు ప్రజల పురోగతికోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో...అలాంటి నిర్ణయం తీసుకునే శక్తి కేంద్రానికి ఇవ్వాలని తెలుగుతల్లిని కోరారు.