శశిథరూర్ మోడీ భజనకి డిగ్గీ మద్దతు...

 

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను అంగీకరించడం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని థరూర్ పొగడడంపై కేరళ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతోంది. శశిథరూర్‌పై సరైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కేరళ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ మాత్రం థరూర్‌కు మద్దతు తెలిపారు. శశిథరూర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలలో తప్పులేదన్నారు. స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు శశి థరూర్ అంగీకరించడంలో ఎలాంటి తప్పులేదు. కాంగ్రెస్ కార్యక్రమమైన దాన్ని మోడీ తన సొంతం చేసుకున్నారు అని దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.