టీవీ చర్చా సమయంలో మంత్రి గారిపై రాళ్లు, కుర్చీలు...

posted on: Apr 29, 2016 3:06PM

 

కేరళలోని కార్మిక మంత్రి బేబి జాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై రాళ్లతో దాడి చేశారు. వివరాల ప్రకారం.. కేరళలోని కొల్లాం ప్రాంత శంకరమంగళం జంక్షన్లో  ఓ టీవీ ఛానెల్ చర్యా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతుండగా కొందరు వారిపై రాళ్లు రువ్వి, కుర్చీలు విసిరారు.. తమ ప్రాంతంలో తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ఎమ్మల్యే శిబు ఎంత మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. దీంతో శిబు మద్దతుదారులు అడిగినవారిపై దౌర్జన్యం చేయటంతో వారూ రెచ్చిపోయి రాళ్లు విసిరారు. దీంతో మంత్రి జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు.  గాయపడిన నేతలను ఆసుప్రతికి తరలించి చికిత్స చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...