కేరళలో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం..


కేరళలో కాలేజి విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసి, హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ దారుణం జరిగిన కొద్దిరోజులకే ఇప్పుడు మరో ఘాతుకం చోటుచేసుకుంది. కేరళలోని తిరువనంతపురంలోని కాలేజీలో ఓ 19 ఏళ్ల దళిత విద్యార్ధి బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే ఆమెకు ఆటో డ్రైవర్ ఫైజు అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఈ పరిచయంతోనే తనను ఆటోలో ఎక్కించుకొని.. మార్గమధ్యంలో ఫైజు స్నేహితులు మరో ఇద్దరిని ఎక్కించుకొని ఓ నిర్జర ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె మూర్చకు గురవ్వడంతో అక్కడే వదిలి వెళ్లిపోయారు. అనంతరం బాలిక అరుపులు విని కొందరు వ్యక్తులు వచ్చి ఆమెను కాపాడి.. ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించగా అసలు విషయం బయటపడింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. షైజుతో పాటు మరో నిందితుడిని సుజిత్ గా బాధితురాలు గుర్తించిందని పోలీసులు చెప్పారు.