చాందీపై అవినీతి ఆరోపణలఫై సభలో చర్చ

posted on: Oct 25, 2011 2:30PM

తిరువనంతపురం : కేరళ సీఎం వూమెన్‌ చాందీపై అవినీతి ఆరోపణలు చేస్తూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై శాసనభలో చర్చ చేపట్టారు. టీఎం థామస్‌ ఐజాక్‌ చర్చను ప్రారంభించారు.2005-06లో ట్రావెంకోర్‌ టైటానియం ప్రోడక్ట్‌‌స లిమిటెడ్‌ అనే ప్రభుత్వ రంగ సంస్థలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్ణయాలను సీఎం చాందీ ప్రభావితం చేశారని ఆరోపంచారు. సీఎం జోక్యం కారణంగానే ఆ ప్రాజెక్టు వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోయిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల నష్టం వచ్చిందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చాందీని సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. గతంలో కూడా ఈ ఆరోపణలపై చాందీ సమాధానాలు ఇచ్చినప్పటికీ, ప్రతిపక్షాలను తృప్తి పర్చలేకపోయారు. దీంతోనే మరోసారి చర్చకు స్వయంగా చాందీని అంగీకరించారు. ఈ అంశంపై ప్రజలకు తెలియపర్చేలా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...