తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్దే

గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నియామకంలో చాలా వివాదాలే జరుగుతున్నాయి. ఈ వివాదంలో ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగివచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాత్కాలికంగా శకుంతలా గామ్లిన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నా.. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు అధికారాలు స్పష్టం చేస్తూ కేంద్రం గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనపై తుది నిర్ణయం తీసుకునేది లెఫ్టినెంట్ గవర్నర్ దేనని, కొన్నిటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... తుది నిర్ణయం మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ దేనని స్పష్టం చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తుందని ఆప్ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నజీబ్ లు లేఖాస్త్రాలు సంధించున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ రాయగా... తమ అధికారాలు గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన అవసరం లేదని ప్రతిస్పందించారు. ఈ ఆధిపత్య పోరు కాస్తా ముదిరి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దాకా వెళ్లింది.