Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీబీఐ రైడ్ పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యాలు..
posted on: Dec 18, 2015 1:59PM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యలయంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయంపై సీబీఐ దాడులు చేయడంపై కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరోపక్క అధికార ప్రభుత్వ.. సీబీఐ అనేది స్వచ్ఛంధ సంస్థ దానికి ఆదేశించే అధికారం ఎవరికి ఉండదు అని.. సీబీఐ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. ఈనేపథ్యంలో అటు కేజ్రీవాల్ కి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి మళ్లీ ఇప్పుడు కేజ్రీవాల్ ట్విట్టర్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దారికి రాని వారిని అంతం చేసే పనిలో సీబీఐ ఉందని.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తమ దారికి రాని ప్రతిపక్షాలపై ఎంతవరకైనా వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని.. ఈవిషయాన్ని ఓ అధికారే స్వయంగా తమకు చెప్పాడని కేజ్రీవాల్ ట్వీట్టర్లో తెలిపారు. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి. మరి కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.



.jpg)


