ప్రధాని విద్యార్హతలేంటో చెప్పండి.. కేజ్రీవాల్

 

ఢిల్లీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టుండి ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు తెలుసుకోవాలని అనిపించినట్టుంది. అందుకే మోడీ విద్యార్హతలు తెలియజేయాలని ఏకంగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై పలు అనుమానాలు ఉన్నాయని.. మోడీకి ఎలాంటి విద్యార్హతలు కానీ.. డిగ్రీలు కానీ లేవని ఆరోపణలు వస్తున్నాయి.. ఈనేపథ్యంలో ఆయన విద్యార్హతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు నా విద్యార్హతల గురించి సీఐసీ తెలుసుకుంది.. మరి ప్రధాని విద్యార్హతల గురించి ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. మరి కేజ్రీవాల్ కోరినట్టు ప్రధాని విద్యార్హతల గురించి చెబుతారో లేదో చూడాలి.