సీబీఐ ఆ ఫైళ్లు తీసుకెళ్లింది.. కేజ్రీవాల్

ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు, కేంద్రానికి మధ్య వివాదం పెరిగిపోతుంది. తన కార్యలయంలో సీబీఐ దాడులు జరపడంపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో సీబీఐ దాడులు జరిపి పలు కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుందని అరోపించారు. సీడీడీఏ కుంభకోణంకు సంబంధించిన ఫైళ్లను సీబీఐ తీసుకెళ్లింది.. ఈ కుంభకోణంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉందని అన్నారు. ఈ కుంభకోణంలో అరుణై జైట్లీ పాత్ర ఉందని.. తనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.