Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేటి నుంచి కేదారనాథునికి పూజలు
posted on: Sep 11, 2013 7:47AM

ప్రకృతి సృష్టించిన జల విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రం కేదార్నాద్లో ఈ బుధవారం నుంచి పూజలు మొదలు కానున్నాయి. గత 86 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సైన్యం సహాయక చర్యలు నిర్వహించిన ఈ క్షేత్రంలో ఇక పరిస్థితి పూర్తి చక్కబడలేదు.. అయినా ఇప్పటికే చాలా రోజులు ఆలస్యం కావటంతో నేటి నుంచి పూజలు నిర్వహించటానికి ఆలయ అధికారులతో పాటు కమిటీ సభ్యులు కూడా తీర్మానించారు.
24 మంది పురోహితులతో కూడిన బృంధం ఆలయ కమిటీ సమక్షంలో ఈ రోజు శాస్త్రోక్తంగా పూజలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పూజలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినా. భక్తులను మాత్రం ఇప్పట్లో అనుమతించే అవకాశం లేదంటున్నారు ఆలయ కమిటి.





