Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ ను ఏడిపించిందెవరు?
posted on: Jun 24, 2015 3:06PM

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏడుపు తన్నుకుంటూ వచ్చిందట.. కానీ ఏవరైనా చూస్తారేమో అని ఆపుకున్నారట.. ఈ విషయం ఎవరో కాదు కేసీఆరే స్వయంగా చెప్పారు. అంతలా కేసీఆర్ ని ఏడిపించిందెవరు అనుకుంటున్నారా.. వివరాల ప్రకారం... కేసీఆర్ గజ్వేల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారట. అయితే అక్కడ ఓ ఇద్దరు అమ్మాయిలు కేసీఆర్ దగ్గరకొచ్చి ‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాథలం. మాకు ఎవరూ లేరు సార్..’ అన్నారట.. అంతే ఆ మాటలకి కేసీఆర్ కు ఏడుపొచ్చిందంట కానీ కంట్రోల్ చేసుకున్నారట. దీంతో కేసీఆర్ పదో తరగతి తర్వాత అనాథ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సూచించారు. దీనిలో భాగంగానే మొదటి రెసిడెన్షియల్ స్కూల్ ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు.



.jpg)


