సీబీఐ కేసు: కేసీఆర్ బ్యాచ్‌కి జగన్ గతి పట్టబోతోందా?

posted on: Apr 25, 2014 3:27PM

 

 

 

ఇంతకాలం కేసీఆర్ అండ్ బ్యాచ్ తెలంగాణ ఉద్యమం పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని, సీమాంధ్ర పారిశ్రామికవేత్తలను బెదిరించి కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కేసీఆర్ తన అక్రమ సంపాదన అంతా వ్యవసాయం అకౌంట్లో వేసేసి వైట్ మనీ చేసుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఇంతవరకు విచారణ జరిపే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు సీబీఐ కోర్టు కేసీఆర్, హరీష్ రావు, విజయశాంతి ఆస్తులపై విచారణకు ఆదేశించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రే అని హరీష్ రావు మొత్తుకుంటున్నాడు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం సీబీఐ కోర్టు విచారణకు ఆదేశించడం చాలా కీలకమైన నిర్ణయం అని భావిస్తున్నారు. మాజీ మంత్రి శంకర్రావు వైసీపీ నాయకుడు జగన్ మీద చేసిన కంప్లయింట్ మేరకు ఇలాంటి ఆదేశాలే జారీ అయ్యాయి. వాటివల్ల జగన్ 16 నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ అండ్ టీమ్‌కి కూడా జగన్‌కి పట్టిన గతే పట్టబోతుందా అనే అనుమానాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...