TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ మెడకు చుట్టుకుంటోన్న మరో కేసు

Published on: Thu Oct 29, 2015 11:50AM

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఈఎస్ఐ బిల్డింగ్స్ కాంట్రాక్ట్ విషయంలో ఇప్పటికే కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించగా, ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం బయటికొచ్చింది, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు... సహారా గ్రూప్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని, సహారా గ్రూప్ లో ఐదు కంపెనీలు సొంతంగా ప్రావిడెండ్ ఫండ్ నిర్వహించే వెలుసుబాటు కల్పిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ నిర్ణయంతో ఆ కంపెనీల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది, దాంతో సీబీఐ దీనిపైనా ఫోకస్ పెట్టిందని, సహారా పీఎఫ్ అకౌంట్లపై దర్యాప్తు జరపనున్నట్లు తెలిసింది, పైగా సహారా గ్రూప్ చేపట్టిన డిపాజిట్ల సేకరణ వివాదాస్పదం కావడం, ఏడాదికాలంగా సుబ్రతారాయ్ జైల్లో ఉన్న నేఫథ్యంలో ఈ కేసు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశముందని అంటున్నారు.