చింటూ ఆస్తులు జప్తు చేస్తున్న పోలీసులు

కటారి దంపతుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 28 మందికి నోటీసులు అందజేయగా.. ఇప్పుడు మరో 40 మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిధ్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు చింటూతో వ్యాపార లావాదేవిలు జరిపిన వారిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆస్తులను పోలీసులు జప్తు చేస్తున్నారు. ఇప్పటికే మురకం బుట్టలో ఉన్న వైన్ షాప్, యాదమర్రిలో చింటూ క్వారీలో ఉన్న వాహనాలు, యంత్రాంగాలు సీజ్ చేశారు. అంతేకాదు కర్నాటకలో కూడా చింటూకు ఆస్తులు ఉన్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా సంతపేటలో ఉన్న చింటు అనుచరుడు మురుగ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.