ముగిసిన వివాదం.. మెరీనాలోనే అంత్యక్రియలు

posted on: Aug 8, 2018 12:01PM

 

మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించడం కుదరదని తమిళనాడు ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.. దీనిపై డీఎంకే నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు.. అయితే మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెరీనాలో అంత్యక్రియలకు అంగీకారం తెలిపింది.. కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు కోరినట్టుగానే కరుణానిధి అంత్యక్రియలు అన్నా మెమోరియల్ పక్కనే నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.. హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..  సాయంత్రం 4 గంటలకు మెరీనా తీరానికి కరుణానిధి భౌతికకాయాన్ని తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...