మార్కులు వేయకపోతే మంత్రం వేస్తా

 

పరీక్షలు సరిగా రాయకపోతే సాధారణంగా పిల్లలు ఏడుస్తారు. కాని ఓ విద్యార్ధి ఏకంగా టీచర్లనే చంపేస్తానంటూ బెదిరించాడు. ఎక్కడంటారా... కర్ణాటకకు చెందిన ఓ విద్యార్ధి పదో తరగతి పరీక్షలు రాశాడు. సరిగ్గా రాయలేదో ఏమో గాని పేపర్లు దిద్దే టీచర్లకు ఓ లేఖ రాసి దానిని ఆన్సర్ షీట్ తో పాటు జత చేశాడు. తనను పరీక్షల్లో ఫెయిల్ చేశారంటే వారి ఫ్యామిలీనంతా మంత్రాలతో చంపేస్తానని, తనను ఫెయిల్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని, తన సమాధాన పత్రం చూడకుండా పాస్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ లేఖలో రాశాడు. ఆ లేఖను కర్ణాటక విద్యాశాఖాధికారులు విడుదల చేశారు. అయితే అధికారులు విద్యార్ధి హరిహర ప్రాంతానికి చెందిన వాడని వెల్లడించారు తప్పా... విద్యార్ధి గురించి మరిన్ని వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.