ముంబై-కరాచీల మధ్య విమానాలను నిషేధించిన పాక్

posted on: May 7, 2017 5:25PM

భారత్‌పై వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకుంది పాకిస్థాన్. ముంబై-కరాచీల మధ్య తిరిగే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటన చేసింది. ఈ నిషేధం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని, అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు ముంబై నుంచి కాకుండా న్యూఢిల్లీ, జైపూర్, ముంబై, అమృతసర్‌ల నుంచి  కరాచీ, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాలకు నడిపే అంతర్జాతీయ సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...