కనుమ రోజు కోడి పందేల జోరు 

posted on: Jan 15, 2025 10:57AM

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి.  సంక్రాంతి  సంబురాలైన చివరి రోజు కనుమ రోజున పందేలు ఊపందుకున్నాయి.  ఈ యేడు పురుషులతో బాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పందెం రాయుళ్లు  లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు ఆచారంగా వస్తోంది.  బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల వరకు చేతులు మారినట్టు అంచనా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200 కి పైగా బరులు బరిలో దిగాయి. మురమళ్ళలో వీఐపీలో బరి రూ.60 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు పందాలు జరిగియని సమాచారం.  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు మూడో రోజుకు చేరుకున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...