ఆ హీరోయిన్ నా భార్య.. కాపురానికి పంపండి...

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో కార్తీక్ గౌడ అరెస్టు వరకూ వెళ్ళి బెయిల్ దొరకడంతో జైలు జాతకం తప్పించుకున్నాడు. అయితే మంత్రి కొడుకు మీద కేసు పెట్టిన హీరోయిన్ మైత్రేయని మరో కేసు వేధిస్తోంది. హీరోయిన్ మైత్రేయ తన భార్య అని, తామిద్దరం గతంలో పెళ్ళి చేసుకున్నామని, అయితే మైత్రేయ తనతో కాపురం చేయడం లేదని కన్నడ దర్శకుడు రుషి మొత్తుకుంటూ కేసు పెట్టాడు. ఇప్పుడు రుషి తన భార్య మైత్రేయ తనతో కాపురం చేసేలా ఆదేశించాలని కోరుతూ బెంగుళూరులోని కుటుంబ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.