శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ!
posted on: Oct 8, 2024 2:30PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. . శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆశ్వయుజ సుద్ధ షష్ఠి మంగళవారం (అక్టోబర్ 8) కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా అధికారులు చేసిన ఏర్పాట్లు ప్రశంసలందుకుంటున్నాయి.




(2).webp)





