Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కడప కాంగ్రెస్ లో కలవరం
posted on: Mar 21, 2012 2:56PM
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. ఈ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోయే ఉపఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఈ మూడు నియోజకవర్గాల స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా టిక్కెట్ ఆశిస్తున్న అభ్యర్థుల సమాఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇది కూడా ఆ పార్టీకి తలనొప్పిగా మారనుంది. ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తే మరో అభ్యర్థి కినుక వహించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండవచ్చుననే భయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కోడూరు నియోజకవర్గ అభ్యర్థిత్వం ఎమ్మెల్సీ చంగలరాయుడు, ఎంపి సాయిప్రతాప్ లకు ప్రతిష్టగా మారింది. గంటి ప్రసాద్ పేరును ఎంపి సూచిస్తుంటే ఈశ్వరయ్య పేరును ఎమ్మెల్సీ చంగలరాయుడు సూచిస్తున్నారు. కాంగ్రెస్ వర్గాల కథనం ప్రకారం ఈశ్వరయ్యకే టిక్కెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఎంపి వైఖరి ఎలా వుంటుందోనన్న ఆందోళన కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి టిక్కెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.


.jpg)
.jpg)


