నన్ను చంపాలనుకున్నోళ్ళే చచ్చారు: పాల్

 

 

 

ఎప్పుడూ కామెడీ స్టేట్‌మెంట్లు ఇచ్చే మత ప్రచారకుడు కేఏ పాల్ తాజాగా చాలా సీరియస్‌గా మాట్లాడాడు. తనను గతంలో చాలామంది చంపాలని అనుకున్నారని, తనను చంపాలని అనుకున్నవాళ్ళే చచ్చారని కేఏ పాల్ చెప్పారు. ఈ స్టేట్‌మెంట్ విన్నాక, పాల్‌ని చంపాలనుకున్నవాళ్ళు.. ఆ తర్వాత చచ్చిపోయినవాళ్ళు ఎవరబ్బా అనే ఆలోచన రాష్ట్రంలో మొదలైంది. చాలామంది మనసులలో ఒక పేరు స్ఫురించినప్పటికీ, పోయినోళ్ళందరూ మంచోళ్ళు.. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులూ అనే పాట గుర్తొచ్చి సైలెంట్‌గా వుండిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకూ స్ఫురించింది కదూ.. అయితే మనసులోనే పెట్టేసుకోండి. అన్నట్టు కేఏ పాల్‌కి వైసీపీ అధినేత జగన్ మీద పీకలదాకా కోపం వున్నట్టుంది. జగన్ పేరు చెబితేనే పాల్ పాలు మరిగినట్టు మరిగిపోతున్నాడు. జగన్ ఈ ఎన్నికలలో పొరపాటున కూడా గెలవడని ప్రార్థనల మీద ఒట్టేసి మరీ చెబుతున్నాడు. ఒకప్పుడు బిజీ మత ప్రచారకుడిగా వున్న కేఏ పాల్‌ని అణగదొక్కేసి, బ్రదర్ అనిల్‌కుమార్ని మత ప్రచారకుడిగా పైకి తేవడానికి కుట్ర జరిగిందన్న అభిప్రాయాలు జనంలో వున్నాయి. ఈ కుట్రలో భాగంగానే కేఏ పాల్ మీద ఏవేవో కేసులు పెట్టి జైల్లో వేయించారన్న అభిప్రాయలు కూడా వున్నాయి. అందుకే కేఏ పాల్ ఇప్పుడు జగన్ మీద విరుచుకుపడుతున్నాడు.