కేసీఆర్ అల్లిన కథనే స్టీఫెన్ సన్ చెప్పాడు.. మత్తయ్య

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరసలేం మత్తయ్య కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఓ అందమైన పిట్టకథ అల్లారని.. అదే పిట్టకథను తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో కోర్టులో చెప్పించారని ఎద్దేవ చేశారు. స్టీఫెన్ సన్ ఎమ్మెల్యేగా నామినేటెడ్ అవ్వడానికి రూ కోటి రూపాయలు కేసీఆర్ కు అందించారని.. ఈ విషయాన్ని స్టీఫెన్ సన్ స్వయంగా చెప్పారని తెలిపారు. కానీ తనకు టీఆర్ఎస్ నేతల నుండి ఎదురైన అవమానాల కారణంగా ఆ పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న స్టీఫెన్ సన్ ను కేసీఆర్ చంపేస్తానని... పదవి రద్దు చేస్తానని బెదిరించారని.. అందుకే స్టీఫెన్ సన్ కేసీఆర్ అల్లిన కథను కోర్టులో చెప్పారని వెల్లడించారు.