జగన్ పాట పాడుతున్న జేసీ

 

 

 

రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు చెబుతానని, ఏ పార్టీలోకివెళ్లేదీ తెలియచేస్తానని చెప్పారు. ఇప్పటికీ తనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీస్ అందలేదన్నారు. ఒకవేళ అందినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. "ఇప్పటికీ వైసీపీలో మా కుటుంబానికి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఆ పార్టీ తరపున మాకు రావచ్చు. ప్రస్తుతం వైసీపీలో ప్రకటించిన వారికి గానీ, మరొకరికి గానీ పార్టీ టికెట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికీ వైసీపీతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.