స్వపక్షంలోనే వ్యతిరేకత

posted on: Apr 1, 2013 3:22PM

J.C. Diwaker Reddy Against Power Charges Increase, J.C. Diwaker Reddy Against Surcharge Hike, JC Diwaker Against Power Cuts and Charges Hike

కిరణ్ పాలనపై విపక్షాలే కాదు స్వపక్షంలో కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. కిరణ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి, సి.రామచంద్రయ్య విద్యుత్ సంక్షోభం, సర్ ఛార్జి వసూలుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రకటనలు చేస్తున్నారు. వి.హనుమంతరావు సి.ఎం.కిరణ్ కు లేఖ వ్రాయగా, చిరంజీవి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ కు లేఖ రాశారు. సి.రామచంద్రయ్య కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి చీఫ్ సత్యనారాయణకు లేఖలు వ్రాసారు. ఇప్పుడు మాజీమంత్రి జెసి దివాకర్ రెడ్డి వంతు వచ్చింది. ఏ ప్రభుత్వమైనా ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని, విద్యుత్ ఛార్జీల పంపుతో ప్రజలు ఇబ్బందుల పాలవుతారని, ఛార్జీల పెంపును పునఃపరిశీలించాలని, కాంగ్రెస్ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి మరొకసారి పునరాలోచించుకుని ప్రజలకు ఆమోదయోగ్యమైన, అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...