టీడీపీ, బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు


టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇతర పార్టీలపైనే కాదు సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆయన దిట్ట. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు అటు టీడీపీ.. ఇటు బీజేపీ రెండు పార్టీలూ డైలమాలో పడ్డాయి. రాష్ట్రం విడిపోయి..ఏడాదిన్నర అవుతోంది.. ఈ ఏడాదిన్నర కాలం పాటు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్రం ప్రభుత్వం పాలన చేస్తుంది కాని.. రెండు ప్రభుత్వాల పాలనా విధానంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాదు రెండు ప్రభుత్వాలు తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని లేకుంటే ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని సలహా కూడా ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే విజయవాడలో ఉండి పరిపాలన చేస్తున్నారు.. కానీ ఉద్యోగులు మాత్రం హైదరాబాద్లో ఉన్నారని..అందుకే పాలన గాడి తప్పుతోందని.. రెండు పడవల మీద ప్రయాణంలా కాకుండా.. ఒక పడవమీద ప్రయాణం చేస్తే మంచిదని హితవు పలికారు.