బెయిల్ వచ్చినా జైల్లోనే జయలలిత
posted on Oct 18, 2014 10:54AM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసిన ఆమె ఇంకా జైల్లోనే వున్నారు. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రత్యేక కోర్టుకు శుక్రవారం చేరలేదు. దీంతో ఆమె శుక్రవారం అంతా జైల్లోనే వుండాల్సి వచ్చింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే జయలలితను విడుదల చేస్తామని కర్ణాటక డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జయసింహ చెప్పారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ ఇచ్చిన విషయం జయలలితకు తెలిసిన, అధికారికంగా ఆ విషయాన్ని జైలు అధికారులు తెలియజేయలేదు. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత జయలలితకు ఆ విషయం తెలిజేస్తామని జయసింహ అన్నారు. శనివారం సాయంత్రం ఆమె విడుదలకు అవకాశాలున్నట్లు తెలిపారు. గతనెల 27 నుంచి జయలలిత బెంగుళూరు జైల్లో వున్నారు. జయలలితతోపాటు ఆమె సన్నిహితులు శశికళ, ఇళవరసి, సుధాకరన్కి కూడా బెయిల్ లభించింది.