అమ్మకు ప్రేమతో.. ఒక్క రూపాయికే ఆటో సర్వీసు

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అమ్మా ప్రమాణ స్వీకారం సందర్బంగా ఓ ఆటో డ్రైవర్ చాలా కేవలం ఒక్క రూపాయికే తన ఆటో సేవలు అందించాడు. వివరాల ప్రకారం.. 45ఏళ్ల మాథివనమ్ గత 25 ఏళ్లుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అంటే ఎంతో అభిమానం. ఈ కారణంతోనే అన్నాడీఎంకే ఎప్పుడు ఎన్నికల్లో గెలిచినా..తన అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. అలాగే ఈసారి కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు. జయలలిత ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక్క‌రూపాయికే ప్ర‌యాణికుల‌కు సేవ‌లందించాడు.