జయలలిత ప్రమాణ స్వీకారానికి బాంబు బెదిరింపు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఆమె ప్రమాణ స్వీకారం తమిళనాడులోని చెపాక్ క్యాంపస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు మద్రాసు రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి బాంబు పెట్టారనే బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కాల్ ఎక్కడినుండి వచ్చిందని విచారణ చేపట్టగా అది ఒక మానసిక వికలాంగుడు చేసినట్టు తెలిసింది. అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తెలిశాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో జయలలిత ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత ఏర్పట్లు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవాళ్లనే లోపనికి అనుమతిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జయలలిత తోపాటు మరో 28 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu