జయలలిత ప్రమాణ స్వీకారానికి బాంబు బెదిరింపు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఆమె ప్రమాణ స్వీకారం తమిళనాడులోని చెపాక్ క్యాంపస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు మద్రాసు రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి బాంబు పెట్టారనే బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కాల్ ఎక్కడినుండి వచ్చిందని విచారణ చేపట్టగా అది ఒక మానసిక వికలాంగుడు చేసినట్టు తెలిసింది. అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తెలిశాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో జయలలిత ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత ఏర్పట్లు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవాళ్లనే లోపనికి అనుమతిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జయలలిత తోపాటు మరో 28 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.