అమ్మ నెంబరు 2 సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..?


తమిళనాడు ఎన్నికలు రెండు రోజుల క్రితమే ముగిశాయి. ఇప్పుడు అందరూ ఎన్నికల ఫలితాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం ఈసారి డీఎంకే పార్టీనే అధికారంలోకి వస్తుందంటున్నారు. ఇక డీఎంకే పార్టీ నేతలు కూడా తమదే పక్కా విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు అన్నాడీఎంకే నేతలు కూడా అమ్మదే విజయని అంటున్నారు. ఎందుకంటే జయలలిత అదృష్ట సంఖ్య 2 అని.. ఈ కారణంగా ఆమె గెలుస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆ నెంబరు గురించిన వివరాలు కూడా తెలుపుతున్నారు. జయలలిత ఓటరు జాబితా నెంబరు 1100 ఈ నెంబరు కలిపితే రెండు వస్తుంది.. ఇంకా ఆమె ఓటు వేయడానికి బయలు దేరిన టైం 9.56 ఇది కూడినా రెండే వస్తుంది.. మరోవైపు స్టెల్లామేరీస్‌ కళాశాలలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,258 మంది కాగా, వారిలో 200వ వ్యక్తిగా జయలలిత తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సంఖ్య మొత్తం కూడినా రెండు వస్తుంది. అంతేనా.. ఓటు వేసిన తర్వాత ‘మరో రెండు రోజుల్లో తెలుస్తుంది’ అంటూ రెండు మీద మంచి ఉపోద్ఘాతమే ఇచ్చారు. ఈనేపథ్యంలోనే అమ్మకు రెండు అంకె కలిసొస్తుందని.. అందుకే రెండోసారి కూడా అమ్మే ముఖ్యమంత్రిగా తమిళనాడులో పాలన చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ రెండు నెంబరు సెంటి మెంట్ వర్కవుట్ అవుతుందో లేదో రేపటితో తేలిపోతుంది.