Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జపాన్ మాజీ ప్రధాని షింజో హత్య .. ఎన్నికల ప్రచారంలో కాల్పులు
posted on: Jul 8, 2022 11:10AM
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. ఆయనపై శుక్రవారం ఒక వ్యక్తి అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. పశ్చిమ జపాన్ నారా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో వుండగానే హఠాత్తుగా ఒకవ్యక్తి షింజోపై కాల్పులు జరిపినట్టు జపాన్ అధికారులు తెలిపారు. తుపాకుల దాడుల సంఘటనలు కనీవినీ ఎరుగని దేశంలో ఈ సంఘటన యావత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యచకితులను చేసింది. శుక్రవారం ఉదయం 11.30 సమయంలో షింజో ఒక వీధిలో ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తుండగా ఆయన వెనుక నుంచి ఒక వ్యక్తి షాట్గన్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షింజో అబే ఛాతిలో బుల్లెట్ తగిలిందని తెలిసింది. అబే వెంటనే కుప్పకూలిపోయారు.
రక్తం మడుగులోని అబేను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా వుంద ని, కార్డియో పల్మనరీ అరెస్టు స్థితిలో వున్నారని టోక్యో మాజీ గవ ర్నర్ చెప్పారు. సంఘటనా స్థలంలో 41 ఏళ్ల అనుమానితుడిని ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది అడ్డు కుని అదుపులోకి తీసుకున్నారు అబే పై కాల్పు లు జరిపిన చోట నుంచి పోలీసులు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.శక్తివంతమైన రాజకీ య కుటుంబం నుంచి వచ్చిన షింజో అబే 1993లో జపాన్ దిగువ సభకు ఎన్నికయ్యారు. అబే తొలి సారిగా 2006 లో జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీవిరమణ చేశారు.
ప్రధాని ఫుమియో కిషిదా, ఇతర మంత్రిమండలి సభ్యులు తమ ప్రచారం నిలిపివేసి వెంటనే టోక్యో వెళ్లా రు. ఎల్డిపి సులభంగా విజయం సాధించాల్సిన సమయంలో ఈ కాల్పుల సంఘటన భారీ ప్రభావం చూపవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జపాన్లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందేందుకు ఆగస్టు 2020లో పదవీవిరమణ చేశారు. అయినప్పటికీ, అతను మరింత రక్షణ వ్యయం కోసం రాజకీయం గా ప్రభావవంతంగా ఉన్నాడు మరియు తైవాన్పై ఏదైనా దాడి చేస్తే దాని ఆర్థిక వ్యవస్థకు వినాశకరమైన దని చైనాను హెచ్చరించాడు.
జపాన్ ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో కొన్ని కఠినమైన తుపాకీ చట్టాలను కలిగిన దేశం, కాల్పులు చాలా అరుదు. కానీ రాజకీయ హింస ఇప్పటికీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది: 2007లో, నాగసాకి మేయర్ ఇట్చో ఇటో మరణించడానికి ముందు వ్యవస్థీకృత క్రైమ్ గ్యాంగ్ సభ్యునిచే రెండుసార్లు తుపాకీ దాడు లను తప్పించుకున్నారు.
ఆయన తన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ పరిస్థితులు దశాబ్దాలుగా అత్యంత ప్రతికూలం గా ఉంది. ప్రతి ద్రవ్యోల్బణం చక్రం నుండి జపాన్ తప్పించుకోవడానికి అబే కృషి అనన్యసామాప్యం అం టారు అక్కడి ఆర్ధికవేత్తలు. దేశం ఏకైక సైనిక కూటమిని ప్రశ్నించే ట్రంప్ పరిపాలనను భరిస్తూనే తన అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.



.webp)


