మరో స్వతంత్ర పోరాటం
posted on Jul 12, 2013 10:12AM
అవినీతి నాయకులను కట్టడి చేసే జన్లోక్పాల్ బిల్లు కోసం సామాజిక వేత్త అన్నాహజారే మరోసారి ఉద్యమించనున్నారు.. అక్టోబర్ నవంబర్ మాసాలలో మరోసారి రామ్లీల మైదాన్ వేదిక జన్ లోక్ పాల్ సాధన కోసం దీక్షచేపట్టునున్నారు..
ఇప్పటికే పలుమార్లు హాజారే ఉద్యమాన్ని అనచివేసిన ప్రభుత్వం మరోసారి అదే పిరస్థితిని ఎదుర్కొనబోతుంది. అవినీతి అధికారులతో పాటు ప్రస్థుత ఎలక్షణ్ ప్రక్రియను కూడా తప్పు పట్టారు హజారే. ప్రస్థుత నడుస్తు విదానంలో కాకుండా రాష్ట్రపతి, ప్రదాన మంత్రి పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలన్నారు.
ప్రస్థుతం జనతంత్ర మోర్చ తరుపున దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న హజారే త్వరలోనే మరోసారి భారీ ఉద్యమానికి వ్యూహం రచిస్తున్నారు.. ఇటీవల నేర చరితులు పోలీస్ కస్టడీలో ఉన్న నేతలు ఎలక్షన్లలో పోటికి అనర్హులు అంటూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు..