రెండ్రోజులపాటు ఇంటర్నెట్ బంద్
posted on: Sep 25, 2015 1:49PM
.jpg)
జమ్మూకాశ్మీర్ లో రెండ్రోజులపాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయ్, బక్రీద్ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకూ ఇంటర్నెట్ ను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది, బక్రీద్ పండుగను సంతోషంగా ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది, అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టకుండా ముందుజాగ్రత్తగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది, దాంతో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు సంతోషంగా జరుపుకునే వీలుంటుందని తెలిపింది, జమ్మూ సర్కార్ ఆదేశాలతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు...డేటా సేవలను నిలిపివేసే పనిలో పడ్డారు







