ఆర్మీపై ఉగ్రవాదుల దాడి..

జమ్మూకాశ్మీర్ టాంగ్దర్ సెక్టార్లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆయిల్ డిపోపై గ్రానైడ్స్ విసిరి దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాను మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ప్రస్తుతం జవాన్లకు, ఉగ్రవాదులకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. భద్రతా దళాలు ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టినట్టు తెలుస్తోంది.