Top Stories

బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో నిరసనకు కేబినెట్ నిర్ణయం

  బీసీలకు 42% రిజర్వేషన్లుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నుంచి  స్పందన కరవైన నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని  కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్న ప్రభాకర్‌ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మంత్రి పొన్న  విమర్శించారు.  బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను జూలై 14న గవర్నర్‌కు పంపాం. గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తుమన్నారు. ఆగస్టు 5,6,7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్‌ కోరామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోరేవారంతా తమతో కలిసి ఢిల్లీకి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. 
బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో నిరసనకు కేబినెట్ నిర్ణయం Publish Date: Jul 28, 2025 9:38PM

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

  వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆయన వేసిన బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. మరోవైపు మద్యం ముడుపుల కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.  పరారీలో ఉన్న 12 మంది అరెస్టుకు వారెంట్‌ జారీ చేయాలని సిట్‌ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వారి అరెస్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అవినాష్‌రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్‌రెడ్డి, షేక్‌ సైఫ్‌, ఈశ్వర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్‌ప్రతాప్‌ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. గత వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని.. డిస్టిలరీలు, లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జూన్ నెలలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డిని అతని అనుచరుడు వెంకటేష్ నాయుడును బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే    
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత Publish Date: Jul 28, 2025 9:09PM

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీడీపీ ఎంట్రీ

  తెలంగాణ స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి రామనాథం ప్రకటించారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీచేసిన టీడీపీ ఆ తరువాత అన్ని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ఘనవిజయం సాధించింది. ఇదే తరహాలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతాయని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాసిరెడ్డి ప్రకటన ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది. గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం పార్టీ ని చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. బనకచర్ల ఇష్యూ ను ప్రధానంగా చేసుకొని విమర్శలకు పదునుపెడుతున్నారు. మళ్లీ తెలంగాణ వ్యతిరేకులు అంతా తెలంగాణ పై దాడికి సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ నేతలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నేడు రామనాథం ప్రకటన బీఆర్ఎస్ నేతల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల వరకే పరిమితం అవుతుందా … లేక 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీకి దిగుతుందా అనే విషయం తేలాల్సి ఉంది. స్థానిక ఎన్నికల్లో ఫలితాలపైనే భవిష్యత్తు లో తెలంగాణ లో ఎన్డీఏ కూటమి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్ర మంతా పోటీచేస్తారా లేక ఖమ్మంతో పాటు మరికొన్ని ఎంపిక చేసిన జిల్లాలకే పరిమితం అవుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీడీపీ ఎంట్రీ Publish Date: Jul 28, 2025 8:50PM

తెలంగాణకు నలుగురు కొత్త జడ్జిల నియామకం

  తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  ఉత్తర్వులు జారీ చేశారు. నూతన న్యాయమూర్తులుగా గౌస్‌ మీరా మొహియుద్దీన్‌, చలపతిరావు సుద్దాల అలియాస్‌ ఎస్‌.చలపతిరావు, వాకిటి రామకృష్ణా రెడ్డి, గడి ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణం చేయనున్నారు.  దేశంలోని పలు హైకోర్టులకు 19మంది జడ్జిలు/అదనపు జడ్జిలు నియమితులయ్యారు. పలువురు న్యాయవాదులు, జ్యుడీషియల్‌ ఆఫీసర్లను జడ్జిలు/అదనపు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు.  మొత్తం 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన జులై 19వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
తెలంగాణకు నలుగురు కొత్త జడ్జిల నియామకం Publish Date: Jul 28, 2025 8:27PM

మినిస్టర్ నంబర్ వన్..పెమ్మసాని

  దేశ రాజకీయాలకు తెలుగు తరం, పనితనాన్ని పరిచయం చేస్తున్నారు ఓ యువ  ఎంపీ ....ఎంపీ గా మాత్రమే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తన పనితనాన్ని , యావత్ భారతదేశానికి పరిచయం చేస్తున్నారు... దీంతో గల్లీ నుండి కాదు,  ఢిల్లీ నుంచి కూడా ఆ ఎంపీ కి ,ఆ కేంద్ర సహాయ మంత్రికి ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి ...సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం ఆ యువ కేంద్ర మంత్రి పనితనానికి అబ్బురపడుతున్నట్లు సమాచారం.... ఇంతకు ఎవరు, ఈ కార్యసాధకుడు,  ఎవరు తెలుగుతనాన్ని, తెలుగు జాతిఖ్యాతిని దేశ వ్యాప్తంగా  ఇనుమడింపజేస్తున్న ఉత్తమ కేంద్రమంత్రి..... మీరే చూడండి ... కార్యసాధకుడు ....ఈ మాట , గుర్తుకు వస్తే గతంలో చాలామంది కనపడేవారు, ... కానీ ఇప్పటి తరంలో కార్యసాధకులు తగ్గిపోయారు ...కేవలం కబుర్లతో కాలక్షేపం చేసేవారు ఎక్కువయ్యారు... రాజకీయాల్లో అయితే ఇలా మాటలు చెప్పి పబ్బం గడుపుకునే  వ్యవహారం మరింత ఎక్కువైంది...  అలాంటి తరుణంలో కొత్తగా ఎన్నికైన ఓ ఎంపీ ,దేశం మొత్తం తన వైపు చూసేలా తన పని మొదలుపెట్టారు... రాజకీయాలలో కొత్తగా ఎంటర్ అయిన ఓ వ్యక్తి ,ఇప్పుడు దేశంలో కార్యసాధకుడిగా గుర్తింపు పొందుతున్నారు... ఆయనే గుంటూరు ఎంపీగా గెలిచి, కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. ఒక ఎంపీ గానే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తనపై ఉన్న బాధ్యతలను ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే దేశంలో అత్యంత ప్రతిభావంతమైన కేంద్ర సహాయ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ ..... తన ఉనికికి కావాల్సింది పదవి కాదు ,తన పనితీరే కొలమానంగా చెలరేగిపోతున్న  కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని,  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇటీవల కేంద్ర మంత్రుల పనితీరు పై చేపట్టిన సమగ్ర సర్వేలో  నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు... జిల్లాకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ గతంలో ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, అమెరికాలో స్థిరపడిపోయారు ...కానీ సొంత ప్రాంతం పై ఉన్న మమకారంతో గుంటూరు ఎంపీగా పోటీ చేసి టిడిపి ఎంపీగా గెలిచారు... అలా మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచిన చంద్రశేఖర్, అభివృద్ధిలో చెలరేగిపోతున్నారు.... అంతేకాదు కేంద్ర సహాయ మంత్రులు కాదు,  మొత్తం కేంద్ర మంత్రుల జాబితా లో సైతం ఆయన ఉత్తమ ఫలితాలు సాధించి , జాతీయస్థాయిలో 5వ స్థానంలో నిలిచారు ....తద్వారా తెలుగుజాతి ఖ్యాతిని ,ఢిల్లీలో మరొకసారి రెపరెపలాడించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ...  చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా గెలిచిన మొదటి రోజు నుండే,  ప్రజల మద్దతుతో, తనకు ఉన్న  చొరవతో ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు చేస్తూనే ఉన్నారు ....ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో సహాయ మంత్రుల్లో, అధికారులతో ఇన్ని సమీక్షలు చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే  లేరని చెప్పవచ్చు.... ఢిల్లీ నుంచి గల్లీ వరకు, ఉన్న అధికారులతో, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం ,గుంటూరు అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం పెమ్మసాని పొలిటికల్ స్టైల్..... గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి,  నుండి గుంటూరులో నూతన  రైల్వే ప్రాజెక్టులు,  అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జి లు , రైల్వే ఓవర్ బ్రిడ్జిలు  అంటూ కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, తాగునీటి సమస్యలపై కేంద్ర సహకారం తీసుకురావడం వంటివి , పెమ్మసాని చంద్రశేఖర్  పనితీరుకు కొలమానంగా చెప్పుకోవచ్చు.... ఇలా ప్రతి దశలో  తన ప్రత్యేకతతో, గుంటూరులోనే కాదు,  ఢిల్లీలో సైతం కార్యసాధకుడిగా ముద్ర వేసుకున్నారు పెమ్మసాని .... కేంద్ర సహాయ మంత్రుల ర్యాంకులు జాబితాలో నెంబర్వన్ స్థానం సంపాదించడం,  పెమ్మసాని వ్యక్తిగత విజయం మాత్రమే కాదు , తెలుగు ప్రజల వారధిగా ,సారధిగా ఢిల్లీలో తెలుగుజాతి ఖ్యాతిని నిలబెట్టిన మరో ప్రజా ప్రతినిధిగా  పెమ్మసాని పేరు చెబుతున్నారు గుంటూరు ప్రజలు......  
మినిస్టర్ నంబర్ వన్..పెమ్మసాని Publish Date: Jul 28, 2025 7:23PM

కోనేరు హంపిని ఓడించి చెస్ ప్రపంచ విజేతగా నిలిచిన దివ్వదేశ్‌ముఖ్

  తనకంటే ఎంతో సీనియర్ అయిన కోనేరు హంపిని ఓడించి ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌ నిలిచింది. తాజాగా (28-7-25) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్‌ విజయం సాధించింది. ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగిసింది.  అయితే ఆ తర్వాత రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది. 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. చివరకు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్యకు 1.5 పాయింట్లు లభించగా, కోనేరు హంపికి 0.5 పాయింట్లు వచ్చాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దివ్యకు హంపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఫలితం ట్రైబ్రేకర్‌కు చేరింది. సోమవారం దూకుడుగా ఆడిన దివ్య టోర్నీ విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సీనియర్ విభాగంలో చాలా తక్కువ టోర్నీలు మాత్రమే ఆడింది. కోనేరు హంపితో పోల్చుకుంటే దివ్య అనుభవం చాలా తక్కువ. ఈ టోర్నీకి ముందు ఆమెకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య.. 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. అలాగే ఒలింపియాడ్‌లో మూడు స్వర్ణ పతకాలను కూడా అందుకుంది. తాజా ప్రపంచకప్‌లో తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక, జు జినర్ వంటి ప్రతిభావంతులను ఓడించి అందర్నీ ఆకట్టుకుంది.
కోనేరు హంపిని ఓడించి చెస్ ప్రపంచ విజేతగా నిలిచిన దివ్వదేశ్‌ముఖ్ Publish Date: Jul 28, 2025 6:30PM

హైదరాబాద్‌‌లో చిరుత సంచారం కలకలం

  హైదరాబాద్‌ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలో  ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుకభాగం మీదుగా మూసీనది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.   ఇటీవల మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో  చిరుత సంచరిస్తోంది. గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.  బోన్లకు చిక్కకుండా  తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డుదాటినట్లు సమాచారం. ప్రస్తుతం చిరుత కోసం ఫారెస్ట్ అధికారులతో కలిసి పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాగా, ఇటీవలే నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్‌ క్యాంపస్‌లో చిరుత సంచారం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే.చిరుత సంచరించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.   
హైదరాబాద్‌‌లో చిరుత సంచారం కలకలం Publish Date: Jul 28, 2025 6:21PM

త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు : మంత్రి కొల్లు రవీంద్ర

  అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.  శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ  కార్యాలయంలో శాసన సభ్యురాలు గౌతు శిరీషతో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.  ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. 
త్వరలో ప్రతి ఆటో డ్రైవర్‌కు  రూ.10వేలు : మంత్రి కొల్లు రవీంద్ర Publish Date: Jul 28, 2025 5:15PM

థాయిలాండ్-కాంబోడియా మధ్య సీజ్ ఫైర్

  థాయిలాండ్ - కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్‌ఫైర్ అమలు చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. కాగా జూలై 24 నుంచి థాయిలాండ్-కాంబోడియా దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.   నాలుగురోజుల థాయ్‌-కంబోడియా సరిహద్దు ఘర్షణలతో 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. యుద్ధం ఆపేందుకు థాయ్‌-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ట్రంప్‌ ప్రకటించారు. మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఆహ్వానం మేరకు థాయ్‌ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్‌ వేచాయచాయ్‌ ఇవాళ చర్చలు సఫలం అయ్యాయి.
థాయిలాండ్-కాంబోడియా మధ్య సీజ్ ఫైర్ Publish Date: Jul 28, 2025 4:47PM

ఫిడే ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌

  ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేత‌గా భారత ప్లేయర్  దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫైనల్‌ టై బ్రేక్‌ గేమ్‌లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించి టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్స్‌లో తొలి రెండు గేమ్స్‌ డ్రాగా ముగిశాయి. దీంతో సోమవారం నిర్వహించిన టై బ్రేకర్‌లో దివ్య గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో గెలిచిన తొలి భారత మహిళగా నిలిచారు.  విజయం సాధించక దివ్య ఎమోషనల్ అయ్యారు. ఈ విజయం ద్వారా దివ్య కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను కూడా సాధించింది. భారత్ నుండి ఈ ఘనత సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఆమె నిలిచింది. ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్‌లో తలపడటం విశేషం
ఫిడే ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌ Publish Date: Jul 28, 2025 4:17PM

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం... జిల్లాల నిబంధన లేదు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత   ప్రయాణం పథకం అమలు కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఒకటి.దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన తరువాత ఈ పథకం అమలుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై ఆయా రాష్ట్రాలలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. దీంతో అన్ని రకాలుగా ఆలోచించి చివరకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి జిల్లాల పరిమితులేమీ లేవనీ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చనీ అచ్చెన్నాయుడు చెప్పారు. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఆయనీ విషయం తెలిపారు.  ఏపీలో మహిళలకు ఎగిరి గంతేసే వార్త. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పథకానికి జిల్లాల పరిమితులు లేవనీ . రాష్ట్రమంతటా అమలు చేస్తామని తెలిపారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ప్రత్తిపాడులో  సుపరిపాలనలో తొలి అడుగు   కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు.  ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ.. ఆ తరువాత మంత్రి నారా లోకేష్ జోక్యంతో దీనిపై విస్తృతంగా చర్చింది, జిల్లాల పరిమితి వద్దని నిర్ణయించినట్లు తెలిపారు.  
 ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం... జిల్లాల నిబంధన లేదు! Publish Date: Jul 28, 2025 4:13PM

జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్

  కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని స్మారక ఘాట్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, పలువురు ఎమ్మెల్యేలు, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు.  హైదరాబాద్‌కు మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు. దేశం మొత్తం మీద నిజాయితీగా పని చేసిన వ్యక్తి అని, ఆయనను తెలంగాణ మరువదని చెప్పుకొచ్చారు. అచ్చంపేట శాసన సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత అయిన జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నాగర్ కర్నూల్ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, జైపాల్‌రెడ్డి వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి, ఆయన కూతురు నైమిష రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  
జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలి...కాంగ్రెస్ నేతల డిమాండ్ Publish Date: Jul 28, 2025 3:53PM

శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒకసారి దర్శించుకోవాలి

  తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇవాళ  శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని వెంకయ్యనాయుడు తెలిపారు.  ప్రభుత్వ లేదా ఇతర కార్యక్రమాలకు మళ్లించకూడదని ఆయన తెలిపారు.  హిందువుల సంప్రదాయాల ప్రకారం ప్రతి ఊరిలో గుడి ఉండాలి. ప్రముఖ దేవాలయాలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పట్టాలి అని పిలుపునిచ్చారు. గుడి బడి లేని ఊరు ఉండకూడదు. బడి కట్టించడం ప్రభుత్వ కర్తవ్యం. గుడి కట్టించడం భక్తులు మరియు ప్రముఖ దేవస్థానాల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి అని మాజీ ఉప రాష్ట్రపతి తెలిపారు. అంతకముందు వెంకయ్యనాయుడు  సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, శ్రీధర్‌‌లు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒకసారి దర్శించుకోవాలి Publish Date: Jul 28, 2025 3:25PM

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. పహల్గాం ఉగ్రవాదులు హతం

  జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్నా ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీనగర్‌లో ఉన్న లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని భద్రత బలగాలు కాల్పలు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పహల్గామ్ దాడి నిందితుడు అని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ట్రాక్ చేస్తూ వెళ్లిన బలగాలను గమనించి.. వారు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తం అయిన బలగాలు.. తిరిగి కాల్పులు జరపడంతో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తుంది. ఈ ఎన్ కౌంటర్ హిర్వాన్- లిద్వాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే ఇంకా కాల్పులు జరుగుతుండటంతో ఆ ప్రాంతం మొత్తం తుపాకులు శబ్దాలతో దద్దరిల్లుతోంది. కాగా ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి.  
శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్..  పహల్గాం ఉగ్రవాదులు హతం Publish Date: Jul 28, 2025 2:54PM

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం (జులై 28) ప్రమాణస్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై  రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచేత  రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌  ప్రమాణం చేయించారు.  హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ అదనపు అడ్వకేట్ జనరల్ పి.సాంబశివ ప్రతాప్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ పార్థసారధి, సహా పలువురు  ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యు లు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం Publish Date: Jul 28, 2025 2:47PM

ఏపీ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారం

బిడదారి ఎస్టేట్ లో కాలినడకన కలియదిరిగిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన విజన్ కు అద్దం పడుతోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజ సోమవారం (జులై 28) ఆయన తన టీమ్ తో సింగపూర్ లో పది వేల కుటుంబాలు నివశించే బిడదారి ఎస్టేట్ ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలన్న ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగా సింగపూర్ లో అర్బన్ హౌస్ ప్లానింగ్ ను పరిశీలించేందుకే చంద్రబాబు బృందం బిడదారి ఎస్టేస్ సందర్శించింది.  సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను సింగపూర్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.  మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకన కలియదిరిగారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చి దిద్దుతు న్నామన్నారు.  అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందనీపేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం వచ్చిందన్న ఆయన  గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు..  గ్యాప్ ను తగ్గించేందుకే  ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చి నట్లు చెప్పారు. భవిష్యత్‌లోనూ సింగపూర్-ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. బిడదారి ఎస్టేటులో గృహ సముదాయాల నిర్మాణం   చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా... చేపట్టారు.  ప్రకృతితో మమేకమయ్యేలా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. అంతే కాకుండా నివాసితులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మాణాలు ఉన్నాయి. కాగా ఈ సందర్భంగా చంద్రబాబు గృహ సముదాయాల నిర్మాణ వ్యయంపై కూడా చర్చించారు.  పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉండేలా చూడడంతో పాటు.. నాణ్యమైన నివాస గృహాల నిర్మాణాల చేపట్టామని చంద్రబాబుకు సింగపూర్ అధికారులు చెప్పారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దిన తీరును ముఖ్యమంత్రి  ప్రశంసించారు. సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ఈ హౌసింగ్ ప్రాజెక్టు అన్ని వసతులతో పర్యావరణ హితంగా అద్భుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. స్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటీ మార్చడం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు.  బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై  చర్చించారు. ఏపీలో, అమరావతిలో చేపట్టబోయే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు.  
ఏపీ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారం Publish Date: Jul 28, 2025 2:34PM

నోబుల్ ప్రైజు వేట‌లో ట్రంప్!

మొన్నీ మ‌ధ్యే ట్రంప్ కు నోబుల్ శాంతి పురస్కారం కోసం అధికారిక నామినేష‌న్ దాఖ‌లు చేసింది అమెరికా. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు నోబుల్ పురస్కారం రావడానికి ఎక్కువ అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి. మొన్న భార‌త్- పాక్ యుద్ధం, నిన్న ఇరాన్- ఇజ్రాయెల్ వార్, మ‌ధ్య‌లో గాజా- ఇజ్రాయెల్ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం. ఈ విష‌యంలో ఆయ‌న ప్ర‌త్య‌ర్ధి మ‌స్క్ నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు చూస్తే థాయ్- కంబోడియా ఘ‌ర్ష‌ణ‌.  భార‌త్- పాక్ ఘ‌ర్ష‌ణ‌ను సుంకాల‌తో ఆపిన‌ట్టు కోర్టులోనే చెప్పుకున్నారు ట్రంప్. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లోకి డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చి బంక‌ర్ బ‌స్ట‌ర్లు వేసి మ‌రీ ఈ యుద్ధం ఆపాన‌ని అంటారు. ఇప్పుడు థాయ్- కాంబో వార్ ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారాయ‌న‌. మీరు గానీ ఈ ఘ‌ర్ష‌ణ ఆప‌కుంటే వాణిజ్య ఒప్పందాల‌న‌నీ ర‌ద్ద‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. థాయ్ ప్ర‌ధాని సైతం అందుకు తాము సిద్ధంగానే ఉన్న‌ట్టు చెప్పారు. నిజానికి ట్రంప్ శాంతికాముకుడిగా పేరు సాధించాలంటే చేయాల్సిన ప‌ని.. ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ ఆపాల్సి ఉంటుంది. అదేమో అంత తేలిగ్గా సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అప్ప‌టికీ ట్రంప్ ర‌ష్యాకు 50 రోజుల గ‌డువు ఇచ్చారు. లేకుంటే మీకు, మీ భాగ‌స్వామ్య దేశాల‌కు సుంకాల మోత మోగిస్తాన‌ని అన్నారు. ఆ మొత్తం 100 శాతం పైగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు కూడా.  కార‌ణం.. ర‌ష్యా ఇప్ప‌టి నుంచే కాదు ఎప్ప‌టి నుంచో అమెరికా అధ్య‌క్షుల పాలిట‌ మొండి ఘ‌టంలానే వ్యవహరిస్తున్నది.  ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే ట్రంప్ సుంకాలు, వాణిజ్య ఒప్పందాల ద్వారా.. ఈ శాంతి స్థాప‌న చేస్తున్నారు. ఇక్క‌డ స్వామి కార్యంలో స్వ‌కార్యం అన్న‌ట్టు.. ఉక్రెయిన్ ర‌ష్యాతో యుద్ధంలో ఉండ‌గానే ప‌దేళ్ల ఖ‌నిజ త‌వ్వ‌కాల ఒప్పందం చేసుకున్నారు ట్రంప్. ఇక పాక్  భార‌త్ తో వార్ లో ఉండ‌గానే.. త‌న కుటుంబ సంస్థ డ‌బ‌ల్యూ ఎల్ ఎఫ్.. తో సంత‌కాలు పెట్టించుకున్నారు. ఒక ప‌క్క త‌న దేశ అవ‌స‌రాలు, మ‌రో ప‌క్క త‌న వ్యాపార అవ‌స‌రాలు తీర్చుకుంటున్న ట్రంప్ నోబుల్ ప్రైజ్ కి ఎలా అర్హుల‌వుతారు.. అన్న‌ది కూడా ఒక ప్ర‌శ్న‌గా క‌నిపిస్తోంది.
నోబుల్ ప్రైజు వేట‌లో ట్రంప్! Publish Date: Jul 28, 2025 2:04PM

రాజీనామా చేసేశా.. ఇంక ఆ పార్టీతో సంబంధం లేదు.. రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఎంపీ అర్వింద్ కుమార్ కూడా దాదాపుగా రాజాసింగ్ బీజేపీలోకి చేరడానికి ఆయన నుంచి ఒక్క మిస్డ్ కాల్ చాలు అంటూ పాజిటివ్ గా మాట్లాడారు. అయితే తాను మళ్లీ కమలం గూటికి చేరనున్నట్లు వస్తున్న వార్తలను రాజాసింగ్ నిర్ద్వంద్వంగా ఖండించారు. అన్నీ ఆలోచించుకునే రాజీనామా చేశాననన ఆయన ఇక ఆ విషయం గురించి ఆలోచించనని పేర్కొన్నారు. కమలం పార్టీలోని పున: ప్రవేశానికి  పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కార్యకర్తల బృందాన్ని తాను పంపినట్లుగా వచ్చిన వార్తలను రాజాసింగ్ ఖండించారు. తన రాజీనామా వెనుక ఎటువంటి కుట్రా లేదనీ చెప్పిన ఆయన,  అమిత్ షా నుంచి తనకు ఎటువంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు.   
రాజీనామా చేసేశా.. ఇంక ఆ పార్టీతో సంబంధం లేదు.. రాజాసింగ్ Publish Date: Jul 28, 2025 1:23PM

చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ బాదుడు

తెలంగాణలో చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ తన సేవల ధరలను అమాంతం పెంచేసింది. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ, కొత్త రేట్లను  ప్రకటించింది. ఎటువంటి ముందస్తు ప్రకటనా లేకుండానే   ఆదివారం ( జులై 28)ఉదయం నుంచీ ఈ కొత్త ధరలను అమలులోనికి తీసుకువచ్చింది.  అధికారులు చడీచప్పుడు కాకుండా రవాణాశాఖ వెబ్‌సైట్‌లో కొత్త ధరలను అప్‌డేట్‌ చేశారు. పలు సేవల ఫీజులు నామమాత్రంగా పెరగ్గా..  కొన్నిటి భారం మాత్రం తడిసిమోపెడు అయ్యేలా ఈ పెంపు ఉన్నది.   ద్విచక్రవాహనం, లెర్నర్స్‌ లైసెన్స్‌కు గతంలో  335గా ఉన్న ఫీజు ఈ కొత్త పెంపుతో .440 రూపాయలు అయ్యింది.  ఇది రెండు క్యాటగిరీలలో పెరిగింది.   కారు లెర్నర్స్‌ లైసెన్స్‌ ఫీజు అయితే 450 నుంచి  585 రూపాయలకు పెరిగింది.  ఇక పర్మినెంట్‌ లైసెన్సుకు సంబంధించిన డ్రైవింగ్‌ టెస్టుకు గతంలో  1,035 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 1,135 రూపాయలకు పెరిగింది. వాహనాల యాజమాన్య బదిలీకి గతంలో   ఫీజు 935 రూపాయలు ఉండగా.. ఇప్పుడది 1,805 రూపాయలు అయ్యింది. ఫైనాన్స్‌పై వాహనాలు తీసుకున్న వారికి ఆయా కంపెనీల హామీ పత్రం (హైపొథెకేషన్‌) ఫీజు గతంలో 2,135రూపాయలు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా వెయ్యిరూపాయలు పెరిగి  3,135 రూపా యలకు చేరుకుంది. రుణ బదిలీకి ఫీజు  2,445  రూపాయల నుంచి నుంచి రూ.2,985 రూపాయలకు పెరిగింది.  ఆటోరిక్షా డ్రైవింగ్‌ టెస్ట్‌ ఫీజు రూ.800 నుంచి రూ.900కు పెంచారు. గతంలో రవాణాశాఖ అధికారులు పంపిన పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో వెంటనే పెంచేసిట్లు తెలిసింది.  
చడీచప్పుడూ లేకుండా రవాణా శాఖ బాదుడు Publish Date: Jul 28, 2025 1:04PM

మావోయిస్టుపార్టీ వారోత్సవాలు.. ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు

తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకూ జరుగుతాయి. అందులో భాగంగానే సోమవారం (జులై 28) నుంచి ఆగస్టు మూడు వరకూ మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాలలో భాగంగా నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో మరణించిన అమరులను స్మరించుకుంటూ జోహార్లు తెలుపుతారు. అలాగే తమకు పట్టు ఉన్న ప్రాంతాలలో  సభలూ, సమావఏశాలు నిర్వహిస్తారు. ఇలా ఉండగా  మావోయిస్టు పార్టీ వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జాతీయ రహదారి పై వాహన తనిఖీలు చేపట్టిట్టారు.  సాధారణంగా మావోయిస్టు పార్టీ వారోత్సవాల సందర్భహంగా నక్సలైట్లు ఉనికి చాటుకునేందుకు విధ్వంసాలకు పాల్పడుతుంటారు. అటువంటి సంఘటనలను నివారిం చడానికి పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోహరించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.  తెలంగాణ, చత్తీస్ఘాడ్ సరిహద్దు ప్రాంతాలలోని జాతీయ రహదారుల గుండా వెళ్ళే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆర్టీసి బస్సులలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతే కాకుండా దండకారణ్యంలో కూంబింగ్ చేస్తున్నారు.  
మావోయిస్టుపార్టీ వారోత్సవాలు.. ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు Publish Date: Jul 28, 2025 12:35PM

జగన్ సర్కారు పాపం.. కోవిడ్ నిధులు వెనక్కి ఇమ్మంటున్న కేంద్రం

అధికారంలో ఉన్న కాలంలో వైసీసీ సర్కారు అవగాహనలేమి, నిర్లక్ష్యంతో వ్యవహరించి ఏపీలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించంది. ఆ క్రమంలో జగన్‌ ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన నిధులను నిర్దేశిత పనులకు వెచ్చించకుండా ఇతర పథకాలకు మళ్లించడంతో..  ఆయా నిధులను తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. జగన్‌ జమానాలో జరిగిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొవిడ్‌-19 నియంత్రణ కోసం నిధులు విడుదల చేసింది. కేంద్రం ఏ కార్యక్రమానికి నిధులిచ్చినా 60శాతమే ఇస్తుంది. మిగిలిన 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కేటాయించి.. నిర్దేశిత కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలి. కొవిడ్‌ రెండో దశలో కేంద్రం టెస్టింగ్‌ కిట్స్‌, రోగులకు అవసరమైన మందులు, ఇతర అవసరాల నిమిత్తం రూ.300కోట్లకుపైగా కేటాయిచింది. దీనిలో కేంద్ర వాటా రూ.208 కోట్లు. ఈ మొత్తాన్ని 2022-23 సంవత్సరంలోనే విడుదల చేసింది. దీనికి మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద రాష్ట్రప్రభుత్వం మరో రూ.139 కోట్ల ను కేటాయించాల్సి ఉంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వడంలో అప్పటి జగన్‌ ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించింది. 2022-23లో కేంద్రం ఇచ్చిన రూ.208 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో కేంద్రం సీరియస్‌ అయింది. తాము కొవిడ్‌ కోసం నిధులిచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించింది. తమ నిధులకు వెంటనే మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయాలని అల్టిమెటం జారీ చేసింది. లేదంటే రూ.208 కోట్లకు రెండేళ్ల పాటు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఘాటు లేఖ రాసింది. ఈ మేరకు గత శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కేంద్రం నుంచి లేఖ అందింది. కేంద్రం నుంచి వచ్చిన లేఖను చూసి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు షాకయ్యారు. తమ నిధులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాయడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ తప్పులకు ఇప్పుడు కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కొవిడ్‌ సమయంలో ప్రభుత్వానికి మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌, టెస్టింగ్‌ కిట్స్‌ సరఫరా చేసిన సప్లయిర్స్‌ సైతం నిండా మునిగిపోయారు. కరోనా సమయంలో అప్పటి జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మందులు, కిట్స్‌, మాస్క్‌లు, పీపీఈ కిట్లు కొనుగోలుచేసింది. సప్లయిర్స్‌ కూడా కొవిడ్‌ సమయంలో కష్టమైనా ప్రభుత్వం అడిగిన మందులు, కిట్స్‌ సరఫరా చేశారు. గత ప్రభుత్వం కేం ద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించుకోవడమే కాకుండా రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్నా చాలా మందికి బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు.
జగన్ సర్కారు పాపం.. కోవిడ్ నిధులు వెనక్కి ఇమ్మంటున్న కేంద్రం Publish Date: Jul 28, 2025 12:11PM

బాబు కేబినెట్ లోకి అయ్యన్న, ఆర్ఆర్ఆర్?.. విస్తరణలో అవకాశం ఖాయమన్న ప్రచారం

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ విస్తరణకు సమాయత్తమౌతున్నారన్న చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది. అయితే కేవలం విస్తరణే కాదనీ, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనీ అని తెలుగుదేశం కూటమి వర్గాలు అంటున్నాయి.  కొందరికి ఉద్వాసన, కొత్తవారికి అవకాశం ఉంటాయని అంటున్నారు. ఇందుకు తగినట్లుగానే ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు మంత్రుల పెర్ఫార్మెన్స్ అంటే పనితీరుపై చంద్రబాబు కొన్ని సందర్భాలలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరు మెరుగుపరచుకోకుంటే ఉపేక్షించేది లేదని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కేబినెట్ విస్తరణ| పునర్వ్యవస్థీకరణ అంశం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రస్తుతం కేబినెట్ మంత్రులుగా ఉన్న వారిలో ఔట్ అయ్యేదెవరు?  ఎందుకు వీళ్ళ పర్ఫామెన్స్ పూర్ గా ఉంది అన్న చర్చ ఆరంభమైంది. ప్రస్తుత కేబినెట్ లో కొందరు మంత్రులు ఇప్పటికీ వారి వారి శాఖలపై గ్రిప్ లేదని అంటున్నారు.   అంతే కాకుండా,   ప్రత్యర్థి పార్టీల నాయకులు  ఈ మంత్రులను ఓ ఆట ఆడుకుంటుంటే..  వారిని కట్టడి చేయడంలో  కూడా ఈ మంత్రులు పూర్తిగా ఫెయిల్ అయ్యారంట. ఎంత సేపూ మంత్రిగా ఆడంబరాలు, ఆర్భాటాలతో నన్ను చూడు,  నా కారు సోకు చూడు అన్నట్లుగా సైరన్ కారులు వేసుకొని తిరగటం తప్ప, చేస్తుంది ఏమీ లేదన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ఉన్న స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్లను మంత్రులుగా ప్రమోట్ చేసే అవకాశా లున్నాయని అంటున్నారు.  దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు తెలుగుదేశం, తెలుగుదేశం కూటమిలో గళాన్ని బలంగా వినిపించిన ఈ ఇద్దరినీ రాజ్యాంగ పదవుల పేరుతో గొంతు నొక్కేసి నట్లైందన్న అభిప్రాయం పార్టీ సీనియర్లలోనే వ్యక్తం అవుతోందంటున్నారు.  2019 - 24 మధ్య కాలంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించి కడిగిపారేయడంతో   ప్రస్తుతం   స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు ముందు వరుసలో నిలుస్తారనడంలో సందేహం లేదు.  ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు..  అప్పట్లో తన వాగ్ధాటితో  జగన్ నే టార్గెట్ చేస్తూ తన చేసిన ప్రసంగాలు వైసీపీ సర్కార్ పై ప్రతికూల పవనాలు వీచడానికి దోహదపడ్డాయి. అలాగే  ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న  రఘురామకృష్ణం రాజు.. గతంలో తన రచ్చబండద్వారా జగన్ అరాచకాలను, జగన్ ప్రభుత్వ దురాగతాలనూ ఉతికి ఆరేసేవారు.  అప్పట్లో వైసీపీలో ఎంపీగా ఉండి ఆ పార్టీ, ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ  ప్రజల ముందు పెట్టడంలో రఘురామకృష్ణంరాజు అత్యంత కీలక భూమిక పోషించారు. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు, విమర్శలకు బెంబేలెత్తిపోయిన అప్పటి జగన్ సర్కార్ ఆయనను రాష్ట్రంలో అడుగుపెట్టకుండా నిరోధించింది. అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు కూడా పాల్పడింది. అయినా వెరవకుండా  ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఢిల్లీలో ఉండే జగన్ సర్కార్ అరాచకాలను రోజూ తూర్పారపట్టేవారు.   అలాంటి రఘురాం కృష్ణంరాజుకు సహజంగానే టిడిపిలోకి రాగానే ,ఎమ్మెల్యేగా గెలవగానే మంత్రి పదవి వస్తుందని రఘురామకృష్ణంరాజు, ఆయన అభిమానులే కాదు.. తెలుగుదేశం కూటమి పార్టీల శ్రేణులు కూడా భావించాయి. ఆయనమంత్రిగా ఉంటే..  జగన్ హయాంలోని ఆర్థిక అరాచకత్వం, ఆ సమయంలో జరిగిన అవినీతి లెక్కలన్నీ బయటకు తీసి జగన్ కు చుక్కులు చూపిస్తారని భావించారు. అయితే  సమీకరణాలు కుదరకో, మరోటో.. కారణాలేవైతేనేం..  చంద్రబాబు కేబినెట్ లో అయ్యన్నపాత్రుడికి కానీ, రఘురామకృష్ణం రాజుకు కానీ స్థానం లభించలేదు సరికదా, గట్టిగా గొంతెత్తే అవకాశం లేని  స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు దక్కాయి.   ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి రావడం, కొందరు మంత్రులపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అసంతృప్తి వ్యక్తం చేయడంతో కేవలం ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం కాకుండా.. కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని చంద్రబాబు భావిస్తున్నారన్న వార్తలు వినవస్తుండటంతో మళ్లీ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రఘురామ కృష్ణంరాజులకు కేబినెట్ బెర్త్ అంశం తెరమీదకు వచ్చింది.   ఈ విషయంపై ఏదైనా ఉప్పం దిందో ఏమో తెలియదు కానీ రఘురామకృష్ణంరాజు ఇటీవల తన అమెరికా పర్యటనలో తన మనసులోని భావాలను అక్కడి వారితో పంచుకుంటూ.. తనకు  హోం మంత్రి, లేదా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేయాలన్న ఆశ ఉందని బయట పెట్టుకున్నారు.   ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఖాయమని జరుగుతున్న ప్రచారం ఒకవైపు,  మరోవైపు ఈ ఇద్దరు సీనియర్లు క్యాబినెట్ లోకి వస్తే టిడిపి వాయిస్ మరింత బలపడుతుందన్న ప్రచారం మరోవైపు కూటమి పార్టీల్లో  జోరుగా సాగుతుంది.....  అయ్యన్నపాత్రుడు, రఘురాం కృష్ణంరాజులు క్యాబినెట్ లోకి వస్తే.. రాజకీయంగా అది టిడిపికి మరింత బలాన్ని చేకూరుస్తుందని, వైసీపీయుల అనుచిత వ్యాఖ్యలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పగలుగుతారని తెలుగుదేశం వర్గాలు కూడా భావిస్తున్నాయి.   సరే ఈ ప్రచారం సంగతి పక్కన పెడితే అసలు ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో మంత్రులు ఎందుకు గొంతు ఎత్తలేకపోతున్నారనేది మరొక ప్రశ్న.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తమతమ శాఖలకు సంబంధించిన అంశాలలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చారు. అయినా మంత్రి హోదా అనుభవిస్తూ కూడా..  వైసీపీ నేతల విమర్శలు, వ్యాఖ్యలకు దీటుగా బదులు ఇవ్వకుండా మౌనం వహిస్తుండటం. అలాగే ప్రజలతో మమేకం కాకపోవడంతో కొందరు మంత్రులు  వ్యవహరిస్తున్న తీరు పట్ల సీఎం అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా సొంత వ్యాపారాల కోసం  వైసీపీ నేతలతో కుమ్మక్కయాన్న అనుమానాలు కూడా అడపాదడపా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. త్వరలో జరగనున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనలూ, చేరికలూ ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతోందో.. కేబినెట్ నుంచి ఉద్వాసన ఎవరికో, అవకాశం ఎవరికో?  
బాబు కేబినెట్ లోకి అయ్యన్న, ఆర్ఆర్ఆర్?.. విస్తరణలో అవకాశం ఖాయమన్న ప్రచారం Publish Date: Jul 28, 2025 10:34AM

రాగి, ఇత్తడి పాత్రలను మిలమిల మెరిపించే చిట్కా..!

  రాగి,  ఇత్తడి పాత్రలు ఇంటికి సాంప్రదాయ టచ్ ను  ఇస్తాయి. వీటి కారణంగా ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఈ పాత్రలను ప్రతిరోజూ ఉపయోగించవచ్చు లేదా ఉపయోగించకపోవచ్చు, కానీ చాలా తొందరగా   అవి  మెరుపును కోల్పోతాయి. అయితే వీటిని మళ్లీ కొత్త వాటిలా మెరిపించడం కాస్త కష్టంతో కూడుకున్న పని.  వీటిని తోమలేక చాలా మంది ఇలాంటి పాత్రలను దూరంగా పెట్టేస్తుంటారు. అయితే  పండుగలు, ప్రత్యేక రోజుల్లో రాగి, ఇత్తడి పాత్రలు అవసరం అవుతాయి.  ఈ  రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా కేవలం సెకెన్ల వ్యవధిలో మెరిపించగల మ్యాజిక్ లిక్విడ్ ఉంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ లిక్విడ్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.  ఇంతకీ ఈ మ్యాజిక్ లిక్విడ్ ను తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి? దీన్నెలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి?  తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 2 టీస్పూన్లు ఉప్పు 2 టీస్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్ 1 టీస్పూన్ బేకింగ్ సోడా 2 టీస్పూన్లు వైట్ వెనిగర్ తయారీ విధానం.. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అది పెద్దదిగా ఉండాలి.   ముందుగా గిన్నెలో ఉప్పు వేసి, ఆపై నిమ్మరసం కలపాలి. డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపిన తర్వాత, బేకింగ్ సోడాను కూడా జోడించాలి. చివరగా వైట్  వెనిగర్ జోడించాలి.  ఇలా చేస్తే  రాగి-ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణం సిద్ధమైనట్టే.. ఈ తప్పు చేయొద్దు.. ద్రావణాన్ని తయారు చేస్తున్నప్పుడు వెనిగర్  ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ద్రావణంలో ఎక్కువ వెనిగర్ కలిపితే పాత్రలు శుభ్రం అవుతాయి, కానీ ఎండిన తర్వాత, వాటిపై నల్ల మచ్చలు లేదా గుర్తులు కనిపించవచ్చు. కాబట్టి పాత్రలు మచ్చలు లేకుండా,  మెరుస్తూ ఉండాలంటే  పరిమిత మొత్తంలో వైట్ వెనిగర్  వాడాలి. ఉపయోగించే విధానం.. రాగి,  ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణాన్ని పాత్రపై పూసి పాత్ర మొత్తం అప్లై అయ్యేలా చూడాలి. ఈ ద్రావణం తొలగించిన వెంటనే పాత్ర శుభ్రంగా కనిపిస్తుంది. ఇలా కాకపోతే.. తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక పెద్ద పాత్రలో వేయాలి. ఇందులో పాత్రలను ముంచి తీసినా పాత్రలు మెరిసిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది.                                     *రూపశ్రీ.
రాగి, ఇత్తడి పాత్రలను మిలమిల మెరిపించే చిట్కా..! Publish Date: Jul 28, 2025 10:24AM

సింగపూర్ లో వరుస భేటీలతో బాబుబిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సింగపూర్ పర్యటన రెండో రోజు సోమవారం (జులై 28) పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిథులతో వరుస భేటీలతో బీజీబిజీగా సాగనుంది.  ట్రెజరీ భవనంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్సీలెంగ్ తోచంద్రబాబు భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తారు.  గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి పరిష్కారంపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.    అలాగే ఈ రోజు భేటీలలో పలు కంపెనీల ప్రతినిథులకు చంద్రబాబు   గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు  పోర్టులు తదితర రంగాల్లో  పెట్టుబడులకు గల అవకాశాలను వివరిం చనున్నారు.   లాజిస్టిక్ రంగంలో బలంగా ఉన్న సింగపూర్ నుంచి ఏపీలో పోర్టుల నిర్మాణం విషయంలో సహకారం ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే  గ్రీన్ ఎనర్జీ, సబ్  సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆశక్తి కనబరిచిన సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్, గృహ నిర్మాణంలోనూ ఏపీతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు.  
సింగపూర్ లో వరుస భేటీలతో బాబుబిజీబిజీ Publish Date: Jul 28, 2025 9:48AM

తెలంగాణ కమల దళపతికి స్థానిక ఎన్నికలే తొలి పరీక్ష?!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచంద్ర రావు బాధ్యతలు చేపట్టి అట్టే కాలం కాలేదు. ఈ  నెల మొదటి తేదీన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 5న అధికారికంగా   బాధ్యతలు స్వీకరించారు. అంటే.. ఆయన బాధ్యతలు చేపట్టి నిండా నెల రోజులు కూడా కాలేదు.  ఇంతలోనే, ఆయన పనితనాన్ని తూకం వేసి ఒక అభిప్రాయానికి రావడం సరికాదు.అయితే.. కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది అన్నట్లు.. ఈ కొద్ది రోజుల్లోనే ఆయన ఏమిటో అంతో ఇంతో అందరికీ తెలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి రామచంద్ర రావు ఎన్నిక పట్ల, పార్టీ లోపలా, బయటా కూడా చాల పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. బీజేపీ జాతీయ నాయకత్వం మరో మారు తప్పులో కాలేసిందని.. ఇక రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకట్టలేదన్నవిశ్లేషణలు వినిపించాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నోరున్న నేతలకు ఇవ్వవలసిన అధ్యక్ష పదవిని బీజేపీ అధిష్టానం నోరులేని రామచంద్రరావుకు ఇచ్చి తప్పు చేసిందనే విమర్శలు,విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఆయనకు సౌమ్యుడు  అనే ముద్ర వేసి..  అదొక పెద్ద అనర్హతగా  పెద్ద ఎత్తున  ప్రచారం జరిగింది. చివరకు.. ఆయన తాను అందరూ అనుకున్నట్లు సౌమ్యుడిని కాదంటూ ఏబీవీపీ నాటి గతాన్ని గుర్తుచేయవలసి వచ్చింది.   అదలా ఉంటే.. మరోవంక రామచంద్ర రావు ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, అలకలు, లుకలుకలు ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఉదంతం, ఆ వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్  మధ్య భగ్గుమన్న విభేదాలు ఆయనకు సవాలుగా నిలిచాయి. అయితే.. రామచంద్ర రావు, అధిష్టానం సూచనల మేరకు, ఆవిషయాలను పార్టీ అధిష్టానానికి వదిలేసి  రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టిని కేద్రీకరించారు. నిజానికి, మరో మూడేళ్ళ వరకు  (అవరోధాలు అన్నీ తొలిగి, జరిగితే) స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప ప్రధాన ఎన్నికలు ఏవీ లేని నేపథ్యంలో, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసమే.. బీజేపీ అధిష్టానం  రామచంద్ర రావుకు పార్టీ పగ్గాలు అప్పగించింది.  అందుకు తగట్టుగానే రామచంద్ర రావు  రాష్ట్ర కార్యాలయానికి, పరిమితం కాకుండా జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇతర విషయాలు పక్కన పెట్టి  కార్యకర్తలతో సమావేశ మవుతున్నారు. స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సిద్దం చేస్తూ..  అదే సమయంలో పార్టీని పటిష్టం చేయడం పై దృష్టిని కేంద్రీకరించారు. అలాగే..  జిల్లా మండల స్థాయిలో, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. అందుకే.. రామచంద్ర రావు ఎన్నిక పట్ల పెదవి విరిచిన విశ్లేషకులే ఇప్పుడు అయనకు  ఫస్ట్ టెస్ట్ లో పాస్  మార్కులు ఇస్తున్నారు.  అయితే..  ఇల్లు అలకాగానే పండగ రాదు  అన్నట్లుగా ఇక్కడతో అంతా అయిపోయినట్లు కాదని అంటున్నారు. అసలు కథ ముందుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పాతల మధ్య  అంతర్గత విభేదాలు ప్రస్తుతానికి సర్దుమణిగినా పూర్తిగా సమసి పోలేదని   విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి.. బండి సంజయ్, ఈటల రాజేందర్  వంటి సీనియర్ నాయకుల మధ్య విభేదాలను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. కానీ.. కింది స్థాయిలో విభేదాలు పార్టీకి   ముఖ్యంగా రామచంద్ర రావుకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని  విశ్లేషకులు అంటున్నారు.  తాజాగా మహబూబ్‌నగర్‌  జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలే ఇందుకు నిదర్శనంగా పేర్కొం టున్నారు.అయితే..  క్రమశిక్షణ గీత దాటితే ఎంత పెద్ద నేతలపైనైనా చర్యలు తప్పవని, రామచంద్ర రావు హెచ్చరించిన నేపధ్యంలో.. ముందు ముందు ఆయన చర్యలు ఎలా ఉంటాయి అనేది చూడవలసి ఉందని, అంటున్నారు. అలాగే..  ఇతర విషయాలు ఎలా ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికలే ఆయనకు తొలి పరీక్ష కానున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
తెలంగాణ కమల దళపతికి  స్థానిక ఎన్నికలే తొలి పరీక్ష?! Publish Date: Jul 28, 2025 9:33AM

మనసును చురుగ్గా,  శరీరం దృఢంగా ఉంచే ప్రత్యేక ప్రాణాయామం ఇది..!

  నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన,   రోజువారీ అలవాట్లు సక్రమంగా లేకపోవడం వంటివి  శరీరం,  మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో  యోగా,  ప్రాణాయామంతో  రోజును ప్రారంభిస్తే, మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలం. ప్రాణాయామంలో 'ఉజ్జయి ప్రాణాయామం' చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మనసును చురుగ్గా ఉంచుతూ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. అయితే అసలు ఈ ప్రాణాయామానికి ఉజ్జయిని ప్రాణాయామం అని పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుంటే.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉజ్జయి ప్రాణాయామంలో 'ఉజ్జయి' అంటే 'విజయవంతుడు' లేదా 'విజయం సాధించేవాడు' అని అర్థం. ఈ పదం 'ఉద్' మరియు 'జి' అనే సంస్కృత పదాలతో రూపొందించబడింది. ఇక్కడ 'ఉద్' అంటే లేవడం లేదా బంధనం నుండి విముక్తి పొందడం, అలాగే 'జి' అంటే విజయం సాధించడం. ఇక 'ప్రాణాయామం' అంటే 'నియంత్రిత శ్వాస సాధన'. ఈ ప్రాణాయామం మనలో విశ్వాసాన్ని,  బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీనిని 'విజయవంతమైన శ్వాస' అని కూడా పిలుస్తారు. మెదడుకు మంచిది.. ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గొంతు నుండి మృదువైన శబ్దంతో నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు  దృష్టి స్వయంచాలకంగా శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. ఇది మనస్సు అటు ఇటు కదిలిపోకుండా, చలించకుండా  ఉంచుతుంది.   ఆలోచించే,  అర్థం చేసుకునే శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఉంటే ఉజ్జయి ప్రాణాయామం చాలా బాగా  సహాయపడుతుంది.  లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు, ఉదర అవయవాలపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల  కడుపు తేలికగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యం.. ఉజ్జయి ప్రాణాయామం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస వేగం తగ్గుతుంది. దీని కారణంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచుతుంది,  రక్తపోటును స్థిరీకరిస్తుంది. అధిక రక్తపోటు లేదా ఒత్తిడి ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ   గుండె జబ్బు ఉంటే ఈ వ్యాయామం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులు.. సాధారణంగా ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది.  ఇది గొంతు,  ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగిస్తుంది. నెమ్మదిగా పీల్చడం,  నిశ్వాసించడం ఊపిరితిత్తులను బలపరుస్తుంది,  శ్వాసను సులభతరం చేస్తుంది. ఇది అలెర్జీలు, జలుబు,  శ్వాస సమస్యలకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉజ్జయి ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది,  మంచి నిద్రను ఇస్తుంది.  ఎందుకంటే దీనిని సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  అలసట కూడా తొలగిపోతుంది, దీని కారణంగా రాత్రి త్వరగా నిద్ర వస్తుంది.  ఉదయం ఉత్సాహంగా నిద్రలేవచ్చు. శక్తినిచ్చే ఆసనం.. ఈ ప్రాణాయామం శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది,  శక్తిని పెంచుతుంది.  రోజంతా అలసిపోయినట్లు లేదా సోమరితనంగా అనిపిస్తే ఈ ప్రాణాయామం శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది. అందుకే దీనిని 'విజయవంతమైన శ్వాస' అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసం,  అంతర్గత బలాన్ని పెంచుతుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? ఉజ్జయి ప్రాణాయామం చేయడానికి, ముందుగా ప్రశాంతమైన,  సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని శరీరమంతా రిలాక్స్ గా వదులుగా  ఉంచాలి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి.  గొంతు నుండి తేలికపాటి 'ఘర్' శబ్దాన్ని కూడా చేయాలి. అది చాలా నెమ్మదిగా ఉండాలి. తరువాత ముక్కు నుండి నెమ్మదిగా గాలిని అదే విధంగా వదలండి. ఈ మొత్తం సాధన సమయంలో పూర్తి దృష్టి  శ్వాసపై ఉండాలి. తద్వారా మనస్సు చలించకుండా ప్రాణాయామం మీదే దృష్టి నిలుపవచ్చు. ప్రారంభంలో దీన్ని ఐదు నిమిషాలు చేయాలి. సాధన బలంగా మారినప్పుడు క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
మనసును చురుగ్గా,  శరీరం దృఢంగా ఉంచే ప్రత్యేక ప్రాణాయామం ఇది..! Publish Date: Jul 28, 2025 9:30AM

ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి.. తమిళనాట 11 జిల్లాలకు అలర్ట్ జారీ

కర్ణాటక రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి నదికి వరద పోటెత్తింది. రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులూ అన్ని పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.  దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పోతే కావేరీ నదీ ప్రవాహ ఉధృతి పెరిగింది.   కర్నాటకు నుంచి  కావేరి నదికి   లక్ష 5 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు హోగెనక్కల్ జలపాతాల కు సందర్శకులు వెళ్లకుండా నిషేధించారు.  ఇక సేలం లోని మేటూరు డ్యామ్ కు సైతం భారీగా వరద వస్తుండటంతో లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తమిళనాడులోని 11 జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు.  కావేరి నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  నది పరిసరాల్లోకి  ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. 
ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి.. తమిళనాట 11 జిల్లాలకు అలర్ట్ జారీ Publish Date: Jul 28, 2025 9:17AM

జగన్ హస్తిన పర్యటన అందుకేనా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు సమాయత్తమౌతున్నారు.  కేంద్రంలోని పెద్ద‌ల‌తో ఆయ‌న భేటీ అవ్వాలని భావిస్తున్నారు. నేడో, రేపో ఆయన హస్తినయానం ఉంటుందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. ఈ పర్యటనలో ఆయన బీజేపీ పెద్దలతో కూడా భేటీ అవుతారని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీల నేతలతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. మధ్యం కుంభకోణం కేసు దర్యాప్తు జోరందుకుని తాడేపల్లి లింకులను బయటపెట్టే దిశగా సాగుతుండటంతో ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే హస్తిన పెద్దల మద్దతు అవసరమని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హఠాత్తుగా హస్తిన పర్యటన పెట్టుకుని అక్కడ వారి మద్దతు కూడగట్టాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.   ఔను ప్రస్తుతం మద్యం కుంభకోణం విచారణ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను సిట్ అరెస్టు చేసింది.  వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తరువాత వైసీపీలో గాభరా కనిపిస్తోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటుందన్న ఆందోళనా ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. ఈ కేసులో జగన్ అరెస్టు ఖాయమన్న ప్రజారం కూడా జోరుగా సాగుతోంది. జగన్ కూడా తన అరెస్టు అనివార్యమన్న నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన సందర్భం, సమయంతో సంబంధం లేకుండా తానేమీ పారిపోవడం లేదనీ, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చనీ సవాళ్లు విసురుతున్నారు. ఇక మరో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ జగన్ అరెస్టు అవుతారన్న సంకేతాలు ఇచ్చారు.  అరెస్టు ఎటూ ఖాయమైనప్పుడు పొలిటికల్ మైలేజ్ వచ్చేలా దానిని మలచుకోవాలన్న వ్యూహంతోనే జగన్ ఇప్పుడు హస్తిన పర్యటన పెట్టుకున్నారని చెబుతున్నారు.  ఇక అరెస్టు అయినా రాజకీయంగా తనకు, పార్టీకీ లబ్ధి చేకూరేలా ఏం చేయాలన్న విషయంలో జగన్, వైసీపీ నేతలూ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలోనే హస్తినలో కేంద్ర పెద్దలు, బీజేపీ, కాంగ్రెస్ కూటమి పార్టీల నేతలను కలిసి తనకు వ్యతిరేకంగా ఏపీలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని చెప్పుకుని మద్దతు కూడగట్టే వ్యూహాన్ని జగన్ ఖారారు చేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  
జగన్ హస్తిన పర్యటన అందుకేనా? Publish Date: Jul 28, 2025 4:32AM

తొడగొట్టి.. మీసం మెలేసీ.. పరారీ

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాలేదు. నోటీసుల మేరకు ఆయన నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో శనివారం (జులై 26) ఉదయం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే విచారించారు. అంతే కాదు ఇదే కేసులో   వైసీపీ నాయకులు అనురూప రెడ్డి, హరిప్రసాద్, పచ్చిపాల రాధాకృష్ణ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు.    నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా కేసు నమోదైన సంగతి తెలిసిందే.  అయితే ఈ కేసులో ఏ1గా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు కానీ అరెస్టు చేయలేదు. విచారణ తరువాత కూడా ప్రసన్నకుమార్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ మీడియా ముందు చెప్పారు. ఏ1నే విచారించి వదిలేశారు కనుక.. అనిల్ కుమార్ యాదవ్ ను విచారణకు  పిలిచి అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు డుమ్మా ఎందుకు కొట్టినట్లు. అంతే కాదు పోలీసులకే కాదు, ఎవరికీ అందు బాటులో లేకుండా అజ్ణాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు?   అసలెందుకు అంతగా భయపడుతున్నారు?  అక్రమమైనింగ్ కేసులో తనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న భయంతోనే అనీల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారా? ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో మరో మాజీ మంత్రి కాకాణి అరెస్టయ్యారు. అంతే కాదు.. అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు శ్రీకాంత్ రెడ్డినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ శ్రీకాంత్ రెడ్డి పోలీసు విచారణలో అనిల్ కుమార్ యాదవ్ పేరు బయటపెట్టారు. శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ ను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయంటున్నారు.  దీంతో ఆయన ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు భయం లేకున్నా విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లిపోయారని పరిశీలకులు అంటున్నారు.   జగన్ హయాంలోముందు వెనుకలు ఆలోచించకుండా ఇష్టారీతిన మాట్లాడి, తొడకొట్టి, మీసం మెలేసి మరీ సవాళ్లు చేసిన అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్థులను దూషించడమే రాజకీయం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే వైసీపీ పరాజయం తరువాత నోరెత్తి మాట్లాడటానికే భయపడుతున్నట్లుగా వ్యవహరించారు.  జగన్ హయాంలో ఇదే అనిల్ కుమార్ యాదవ్ స్థాయి, సభ్యత కూడా మరిచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.  అంతేనా నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీకి కూడా యథేచ్ఛగా పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసిందంటే ఆయన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉండేవో అర్దం చేసుకోవచ్చు. ఇప్పుడు అవే అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీ కేసులలో అరెస్టు భయంతో మరోసారి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు పరిశీలకులు. 
తొడగొట్టి.. మీసం మెలేసీ.. పరారీ Publish Date: Jul 28, 2025 3:46AM