తెలంగాణ ప్రక్రియ ఐదు నెలల్లో పూర్తి
posted on: Jul 31, 2013 7:07PM
.jpg)
తెలంగాణ ప్రక్రియ ఐదారు నెలలలో పూర్తి అవుతుందని చెప్పగలనని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్ణయం వల్ల ఒక ప్రాంతం ఓటమి, ఒక ప్రాంతం విజయంగా బావించరాదని అన్నారు. రెండో ప్రాంతంవారి అనుమానాలు హైదరాబాద్ , నదీ జలాల గురించి ఉన్నాయని అన్నారు.అందువల్లనే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారని, అలాగే నదీ జలాలపై చట్టబద్దమైన ఏర్పాట్లు ఉంటాయని ఆయన చెప్పారు.



.jpg)
.jpg)


