గవర్నర్ ను కలిసిన జగన్

 

Jagan meets Governor, Jagan, telangana, samaikyandhra agitation, jagan bail, ysr congress

 

 

ఈ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో కలిసి గవర్నర్ నరసింహన్ కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు గాను శాసనసభను సమావేశపరచమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు.సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని జేఏసీలు, పార్టీలు కలిసి లేఖ తయారు చేస్తే తాను తొలి సంతకం చేస్తానని, ఆ తరువాత అన్ని పార్టీలతో సంతకాలు చేయించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వడం లేదని, ఆయన పార్టీ నేతలు మాత్రం జేఏసీ నిర్వహించే సభలకు హాజరవుతున్నారని, వారిని ప్రజలు నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు.