Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైలునుంచే జగన్ మంత్రాంగం
posted on: Oct 24, 2012 3:52PM
.jpg)
జగన్ జైలునుంచే యధేచ్ఛగా పాలిటిక్స్ నడుపుతున్నాడంటూ టిడిపి ఆరోపిస్తోంది. ఎవరుపడితే వాళ్లు, ఎప్పుడు పడితే అప్పుడు నేరుగా జైలుకెళ్లి జగన్ తో మంతనాలు జరుపుతున్నారని, జైలు అధికారులు రాజలాంఛనాలు కల్పిస్తూ పూర్తిగా సహకరిస్తున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. జైల్లో జగన్ కి పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ సౌకర్యం కల్పించినట్టు గట్టిగా చెప్పగలమని ఆ పార్టీనేత యనమల రామకృష్ణుడు ఆరోపిస్తున్నారు. దీనిపై ఫిర్యాదుచేస్తూ డిజిపికి లేఖకూడా రాశారు. జైల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ జగన్ ని ఎవరెవరు కలుస్తున్నారో ఎందుకు రికార్డ్ చేయడంలేదంటూ యనమల.. అధికారుల్ని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రనికూడా జగన్ జైలునుంచే పర్యవేక్షిస్తున్నాడని యనమల ఆరోపించారు.



.jpg)


