జగన్ పార్టీ మందు, డబ్బు బోగస్సే..
posted on May 5, 2014 12:32PM
జగన్ పార్టీ సీమాంధ్రలో గెలిచి తీరాలనే ఉద్దేశంతో డబ్బు, మద్యం కుమ్మరిస్తోంది. సందట్లో సడేమియా అన్నట్టుగా చెల్లని నోట్లని, కల్తీ మద్యాన్ని కూడా పంచేస్తోంది. జగన్ పార్టీ నుంచి డబ్బు తీసుకున్న చాలామంది అవి చెల్లని నోట్లని తెలుసుకుని లబోదిబో అంటున్నారు. కొంతమంది అయితే తాము డబ్బు తీసుకోవడం పెద్ద తప్పు అనే విషయాన్ని మరచిపోయి, తమకు జగన్ పార్టీ చెల్లని నోట్లు ఇచ్చిందంటూ పోలీస్ స్టేషన్లని కూడా ఆశ్చయించిన సందర్భాలు వున్నాయి. జగన్ పార్టీ చెల్లని నోట్లు ఇస్తే ఇచ్చింది. వాటివల్ల పెద్ద ప్రమాదం లేదు. కల్తీ మద్యం సరఫరా చేస్తోంది. అదే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటి వరకు జగన్ పార్టీ నాయకులు పోయించిన కల్తీ మద్యం కారణంగా ఇప్పటికే సీమాంధ్రలో ముగ్గురు చనిపోయారు. ఎన్నికల లోపు ఎంతమంది చనిపోతారో అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.