Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజీనామాలపై వైసీపీ ఎమ్మెల్యేల్లో విభేదాలు?
posted on: Oct 15, 2015 12:54PM

జగన్ దీక్ష విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో కంగుతిన్న వైసీపీ ముఖ్యనేతలు... నానా హైరానాపడ్డారట, ఒకవైపు జగన్ హెల్త్ రిపోర్ట్ పై మంత్రుల విమర్శలు... మరోవైపు జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా... ప్రభుత్వం దీక్షను భగ్నం చేయకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారంటూ ప్రభుత్వాన్ని బెదిరించారట, ఇదే విషయాన్ని నేరుగా స్పీకర్ కు కూడా చెప్పారట, అయితే మూకుమ్మడి రాజీనామాల ప్రతిపాదనపై కొందరు అభ్యంతరం తెలిపారని తెలుస్తోంది, దాంతో అంతర్మథనంలో పడిన వైసీపీ అధిష్టానం... ఆ నిర్ణయంపై వెనక్కితగ్గిందంటున్నారు. ఒకవేళ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించినా...అందరూ ముందుకురాకపోతే అసలుకే మోసం వస్తుందని భావించి వెనకడుగు వేసిందంటున్నారు. దాంతో జగన్ ను ఆస్పత్రికి లిఫ్ట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని వైసీపీ ముఖ్యనేతలు బతిమాలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణదీక్షకు దిగిన జగన్...చివరికి ప్రభుత్వాన్ని వేడుకుని లిఫ్ట్ చేయించుకోవాల్సిన దుస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది.



.jpg)


