కేసీఆర్ పై కోదండరాం ఫైర్

ఓయూ విశ్వవిద్యాలయంలో ఉన్న భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జేఏసీ నాయకుడు కోదండరాం మండిపడ్డారు. నవ తెలంగాణ విద్యార్ధి జేఏసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరాం... పేదలకు ఇళ్ల కోసం ఓయూ భూములే ఇవ్వాల్సిన అవసరం లేదని కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం మంచిదే కాని వాటి కోసం ఓయూ భూములు ఇవ్వడం సబబు కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని తెలిపారు. ఓయూ భూములు విద్యా సంబంధ, పరశోధనలకు మాత్రమే ఉపయోగించుకోవాలి అని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గద్దెనెక్కక ముందు ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆమాట మరిచిపోయాడని, రెండు లక్షల ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడంలేదని అన్నారు.