Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టైలరింగ్ చేసి ఆస్తులు సంపాదించానని చెప్పిన నయీం భార్య
posted on: Nov 27, 2019 3:58PM

నయీం ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడింది ఐటీ శాఖ. నయీం ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరారు ఐటీ అధికారులు. అటు నయీం భార్య హసీనాబేగంను కూడా విచారించారు ఐటి అధికారులు. ఆమె దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. టైలరింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు తెలిపారు నయీం భార్య హసీనా బేగం. ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేసుకున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ లకు పాల్పడిన గ్యాంగ్ స్టర్ నయీం 2016 లో జరిగిన పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. అప్పటి నుంచి నయీం దందాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు నయీం అనుచరులను కూడా జైలులో వేశారు. తాజాగా ఐటీ శాఖ నయీం ఆస్తులపై ఫోకస్ పెట్టింది.ఎనకౌంటర్ తర్వాత ఆయన బినామీ ఆస్థుల వ్యవహారం పెద్ద ఎత్తున బయటికి వచ్చింది. ఆ ఆస్తుల పైన ఐటి శాఖ , ఇంటితో పాటుగా వాళ్ల కుటుంబ సభ్యులకు 2016-17 సంవత్సరంలోనే నోటీసులు జారీ చేసింది. వాళ్ళ ఇంటికి ఐటీ శాఖకు సంబంధించిన నోటీసులు కూడా అంటించారు. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన ఆస్థుల వివరాలు ఇవ్వాలని గతంలో లేఖ రాసారు ఐటి అధికారులు. ఆ లేఖ ఆధారంగా కొంత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఐటీ అధికారులు నయీం భార్య హసీనా బేగంని పిలిపించారు. ఆమె చెప్పిన సమాధానాలతో ఒక్క సారిగా షాక్ కి గురైయ్యారు.






