బాలయ్య పై ఈసీకి ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

posted on: Dec 5, 2018 10:11AM

 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్‌ మక్తాలా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సందీప్‌ మక్తాలా మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని బాలయ్య వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని ఈసీకి  అందజేశామన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఐటీ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని స్పష్టం చేశారు.  చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో ఒకరి కృషి వల్ల ఐటీ రంగం అభివృద్ధి సాధించలేదన్నారు. ఉద్యోగుల జోలికి రాకుండా ఎవరి ప్రచారం వారు చేసుకోవాలని చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...