నయనతార, సమంత ఇళ్ళపై ఐటీ దాడులు

posted on: Sep 30, 2015 11:08AM

 

ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. వారేగాక ప్రముఖ తమిళహీరో విజయ్ ఆయన చేసిన ‘పులి’ సినిమా నిర్మాత షిబు సెల్వ కుమార్ ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడులో చెన్నై, మధురై, కేరళ రాష్ట్రంలో నయనతార ఉంటున్న కొచ్చి నివాసంపై ఏక కాలంలో ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. దేశంలో మరో 32 ప్రాంతాలలో కూడా ఇళ్ళపై ఐటి శాఖ అధికారులు ఈరోజే దాడులు నిర్వహించారు. అంటే దేశంలో ఇతర సినీ పరిశ్రమలకు చెందినవారి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. ఐటి అధికారులు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక, నిర్మాతల ఇళ్ళు కార్యాలాలపై దాడులు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ చాలా కాలంగా దాడులు చేయకపోవడం వలన ఇవి సంచలనం కలిగిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...