ట్రైనీ ఐపీఎస్‌ని చంపేశారా?

 

హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మూడు రోజుల క్రితం ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్ మరణించిన విషయం తెలిసిందే. మొదట మానవ్‌ ఈత కొడుతూ గాయాలు కావడం వల్ల మరణించాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత విపరీతంగా తాగి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోవడం వల్ల మరణించాడని వార్తలు వచ్చాయి. మానవ్ మృతి విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. తాజగా ట్రైనీ ఐపీఎస్ మను ముక్త్ మానవ్‌ని చంపేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మను ముక్త్ మానవ్ తండ్రి రామ్ నివాస్ మానవ్ తన కుమారుడిని ఎవరో చంపేశారని ఆరోపిస్తున్నారు. తన కుమారుడి మ‌ృతి మీద సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మంచి ఈతగాడైన తన కొడుకు స్విమ్మింగ్ లో పడి మృతి చెందారనడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో చదవి రోజుల్లో మనోముత్తు స్విమ్మింగ్ క్లబ్ సభ్యుడని తెలిపారు. అలాంటి వాడు స్విమ్మింగ్ ఫూల్ లో పడి ఎలా చనిపోతాడని ఆయన ప్రశ్నించారు. అలాగే మానవ్ మద్యం మత్తులో నీటిలో మునిగిపోయి చనిపోయాడన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. మానవ్‌కి ఎలాంటి దురలవాట్లూ లేవని ఆయన స్పష్టం చేశారు.