బొమ్మ దించేయ‌డం అంత‌ సులువా సంజ‌యా!

posted on: Jul 12, 2022 3:34PM

చాలాకాలం క్రితం ఒకాయ‌న‌కు ఇంటిద‌గ్గ‌ర చౌరాస్తాలో బొమ్మ న‌చ్చ‌లేద‌ని తీసేయించాడ‌ట‌. మ‌రో పెద్దా య‌న త‌న స్నేహితుడి పెయింటింగ్ గురించి పొగ‌డ్త‌లు వినివినీ చిరాకేసి బొమ్మ‌ను చీప్‌గా అమ్మే శాడ‌ట‌. సినీ హీరోల వీరాభిమానులు ఫ్లెక్సీల యుద్ధాలు త‌రచూ చూస్తూనే వున్నాం, వింటూనే వున్నాం. ఇపుడు బిజెపి తెలంగాణా అధ్య‌క్షుడు బండి సంజయ్ కూడా ఇలాంటి ప‌ట్టుద‌ల‌తోనే వున్నారు.. కేసీఆర్‌ను గ‌ద్దె దించేయాల‌ని! 

రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకుని, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌జాద‌ర‌ణ వున్న వ్య‌క్తిని అమాంతం ఎలా దించేస్తా రో  క‌మ‌ల‌నాధుల‌కే ఎరుక‌.  తెలంగాణా ప్ర‌భుత్వం ఏర్ప‌డి నప్ప‌టి నుంచి బిజెపి వారికి ఏమాత్రం నిద్ర ప‌ట్టడం లేదు. కేసీఆర్‌ను ఏదో విధంగా ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టి,  అధికారాన్ని చేజిక్కించుకోవ‌డా నికి విశ్వ‌య‌త్నాలు చేస్తూనే వున్నారు. ప్ర‌తీ రోజు ఏదో ఒక మిష‌తో ధ్వ‌జ‌మెత్త‌డం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే చేస్తున్నారు. కాషాయం దండు ఎన్నిక‌ల కోస‌మే ఎదురుచూస్తున్న‌ట్టుగా అనిపిస్తుంది. వారిని ఏ క్ష‌ణాన్న యినా ఈల వేయ‌గానే రంగంలోకి దిగాల‌ని బండివారి ఆదేశం మ‌రి!

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్‌ అన్నారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, సీఎం సీటు నుంచి కేసీఆర్ ను ప్రజలు దింపేయడం ఖాయమని చెప్పారు. రాత్రిపూట కేసీఆర్‌ చేసిన సవాల్‌ను ఎవరూ నమ్మరని, ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని చెప్పారు. బీజేపీని బద్‌నాం చేసి కేసీఆర్‌ రాజకీయ లబ్ధి పొందుతున్నారని, దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికలు తాము చెబితే జరిగాయా? అని ప్రశ్నించారు. అయినా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, ధరణి పోర్టల్‌లో తలెత్తిన లోపాలను సరిదిద్ది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కరీంనగర్‌లో సంజయ్‌ మౌనదీక్ష చేపట్టారు. దీక్షానం త‌రం మాట్లాడుతూ ఆయ‌న‌ అడవి బిడ్డల దగ్గరికే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పోడు భూముల సమస్య లు పరిష్క రిస్తానని, పట్టాలిస్తానని, ధరణి లోపాలను సవరిస్తానని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.

అవినీతిని తగ్గించడానికే ధరణి పోర్టల్‌ తెచ్చామంటూ.. ప్రశాంతంగా ఉన్న ఊళ్లలో కేసీఆర్‌ చిచ్చుబెట్టా రని బండి సంజయ్‌ మండిపడ్డారు. సుమారు యాభ‌య్యేళ్ల  క్రింద‌ట‌ భూములు అమ్ముకున్నవాళ్లు, వాటిని వదిలేసి వెళ్లి పోయిన వాళ్లంతా ఇవాళ ఊర్లోకి వచ్చి రైతులమీద పడి భూములు లాక్కుంటున్నారని, దీంతో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల గుండెలు పగిలిపోతున్నాయని తెలిపారు.  కరెక్షన్‌ చేసు కునే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, ప్రజలు ఓటు అనే ఆయుధంతో కరెక్షన్‌ చేస్తా రనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిన్నటిదాకా జర్నలిస్టులు ప్రశ్నిస్తే దబా యించిన సీఎం ఈ రోజు జర్నలిస్టులను బతిమిలాడుకునే స్థితికి వచ్చారంటే అది బీజేపీ చేసిన పోరాట మేనని అన్నారు. పోడు భూముల్లో పంటలు సాగు చేసుకోవాలని సీఎం కేసీఆరే చెప్పారని, పంట వేసుకొని తీరా చేతికి వచ్చాక అటవీశాఖ అధికారులు, పోలీసులతో దాడులు చేయించి పంటను నాశనం చేయించ డమే కాకుండా వారిపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. పేదలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించాలని, పోడు భూములకు పట్టాలిచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు.

అయితే, బిజెపివ‌న్నీ తాటాకు చ‌ప్పుళ్లే అని ఏదో విని, ఏదో చూసి ఖంగారెత్తి అరిచే పిల్లాడిలా గోల చేయ డం త‌ప్ప వీస‌మెత్తు రుజువు చేసే స్థితిలో బిజెపి నాయ‌కులు లేర‌ని టిఆర్ ఎస్ నాయ‌కుల మాట‌. దేశ మంతా  జోరీగ‌లా గోల చేయ‌డంతో రాజ్యాధికారం ఖాయం చేసుకోవ‌చ్చ‌న్న పిచ్చి న‌మ్మ‌కాల‌తో  అన్ని ప్రాంతాల్లో  ఉద్య‌మాలు చేయాల‌న్న ఉత్సాహం నింపుకోవ‌డం బండి సంజ‌య్ కి మ‌హా స‌ర‌దాగా వుంది. జ‌నాన్ని వేసుకుని తిర‌గ‌డం, ఉద్య‌మిస్తున్నామ‌ని భారీ ప్ర‌చారంతో నాలుగు జంక్ష‌న్ల‌లో హ‌డావుడి చేయ డం  బిజెపి వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆ వెన్న తెలంగాణాలో చేదెక్కిన సంగ‌తి ప్ర‌జ‌లు, ఓట‌ర్లు గ్ర‌హిస్తు న్నార‌న్న‌ది క‌మ‌ల‌నాధులు తెలుసుకోవాల‌ని టిఆర్ ఎస్ హాస్యోక్తులు జోడించి మ‌రీ చెబుతోంది. 

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ, టిఆర్ ఎస్‌, బిజెపి వారి దూకుడు, ఆవేశాల‌న్నీ మౌనంగా చూస్తున్న కాంగ్రెస్ నాయ కులు న‌వ్వుకుంటున్నారు. వీరిద్ద‌రి నాట‌కాలు, చిత్ర‌విచిత్ర భాషోద్య‌మం తెలంగాణా ప్ర‌జ‌లు వింటూ, చూస్తూ బ‌హు పెద్ద హాస్య కామెడీ చూస్తున్నామ‌నే భావ‌న‌లోకి వ‌చ్చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. చిత్ర‌మేమంటే వారూ, వీరూ కొట్టుకుని వెన‌కాలున్న‌వాడికి దారిచ్చార‌న్న సామెత‌గా వుంది. కాంగ్రెస్ ఈ ప‌రిస్థితుల‌ను చాలా తెలివిగా ఉప‌యోగించుకోవ‌డంలోనే తెలంగాణాలో ఆ పార్టీ నిల‌బ‌డేందుకు వీల‌వు తుంది. ప్ర‌జ‌లు కేవ‌లం ఓట‌ర్లు కాద‌న్నది బిజెపికి ఇంకా గ్ర‌హించ‌క‌పోవ‌డం మ‌రీ విడ్డూరం. 

google-ad-img
    Related Sigment News
    • Loading...