ఇరాన్ సేఫ్ కాదు.. ప్రవాసాంధ్రులూ వెనక్కు వచ్చేయండి!
posted on: Feb 24, 2026 8:31AM

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ లో ఉండటం క్షేమం కాదని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇరాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న ఆయన అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెంటనే వెనక్కు తిరిగి రావాలి పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియన్ సిటిజన్స్ కు అక్కడి భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటనలో కోరారు. అక్కడ జరుగుతున్న నిరసనలకు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా తిరిగి రావాలని కోరారు. సహాయం అవసరమైన సందర్భంలో , ఏపీఎన్ఆర్టీ ఏర్పాటు చేసిన 24/7 హెల్ప్లైన్ నంబరు 91 8500027678 ను సంప్రదించాలని పేర్కొన్నారు.



.webp)
.webp)


