Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐపీఎల్-8 వచ్చేసింది..
posted on: Apr 8, 2015 3:00PM
.jpg)
వరల్డ్ కప్ అయిందో లేదో అప్పుడే ఐపీఎల్-8 సీజన్ వేడి మొదలైంది. మంగళవారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఐపీఎల్-8 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అయితే వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమం మొదలైంది. మొత్తం ఎనిమిది జట్ల కెప్టెన్లు ఎప్పటిలాగే బ్యాట్పై సంతకాలు చేసి, ట్రోఫీ ముందు కెమెరాలకు పోజులిచ్చారు. అనంతరం బాలీవుడ్ హీరో షాషిద్కపూర్ బైక్ నడుపుతూ వేదికపైకి వచ్చి డిస్కో డాన్సర్ పాటకు నృత్యం చేశాడు. తరువాత అనుష్కశర్మ పీకే, జబ్ తక్ హై జాను సినిమాలో పాటలకు అదరగొట్టే స్టెప్పులు వేసింది. అయితే అనుష్కశర్మ డ్యాన్స్ చూసి విరాట్ కొహ్లి ముసిముసిగా నవ్వుకున్నాడు. చివరిగా స్టయిలిష్ హీరో హృతిక్ రోషన్ కళ్లు చెదిరే ప్రదర్శనతో కార్యక్రమం ముగిసింది. ఐపీఎల్-8 ఎడిషన్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. 47 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 60 మ్యాచ్ లు నిర్వహిస్తారు. బుధవారం జరిగే తొలి మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్లో బరిలోకి దిగనున్నాయి.






