కోల్ కతా నైట్ రైడర్స్ స్కోర్ 174/5, ముంబై విజయ లక్ష్యం 175

 

ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ముంబై కోల్ కతా మ్యాచ్ లో టాస్ గెలిచి కోల్ కతాకు బ్యాటింగ్ అప్పగించింది ముంబై. బరిలోకి దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఊతప్ప (36, 20 బంతుల్లో), గంభీర్ (59, 45 బంతుల్లో) రాణించారు. చివర్లో వచ్చిన యూసుఫ్ పఠాన్ (19, 8 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. ముంబై ఆటగాడు టిమ్ సౌథీ వరసగా రెండు సార్లు క్యాచ్ లను జారవిడవడం కోల్ కతా కు కలిసొచ్చింది. బౌలింగ్ లో సౌథీ కి రెండు వికెట్లు, మెక్ గ్లెనాగన్, హర్భజన్, హార్థిక్ పాండ్యాలకు తలో వికెట్ లభించాయి. ముంబై విజయ లక్ష్యం 175 పరుగులు. వాంఖడే స్టేడియంలో 200 పరుగుల లక్ష్యం వరకూ ఛేదించే అవకాశం ఉంది. టోర్నీలోనే అత్యంత పొదుపైన కోల్ కతా బౌలింగ్ లో ముంబై ఎంత వరకూ ఛేజింగ్ చేయగలదనేది ఆసక్తికరం.